close
Choose your channels

సబ్ కలెక్టర్‌గా పవన్ వీరాభిమాని.. ఫ్యాన్స్‌లో జోష్!

Friday, May 15, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సబ్ కలెక్టర్‌గా పవన్ వీరాభిమాని.. ఫ్యాన్స్‌లో జోష్!

టాలీవుడ్‌లో పవర్ స్టార్.. రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. పవన్ అనే పేరు వింటే చాలు అభిమానులకు ఒక తెలియని ఉత్సాహం కలుగుతుంది. పవన్ వీరాభిమాని ఒక కుర్రాడు సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకోవడం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పవన్ అభిమానుల్లో ఇలాంటి వారు కూడా ఉంటారండోయ్ మీరూ ఓ లుక్కేయండి అంటూ నెట్టింటో కొన్ని ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఇందులో ఆ సబ్ కలెక్టర్, పవన్ ఇద్దరూ కలిసున్నారు. అసలు విషయం ఏమిటంటే.. పవన్‌ ఆ వీరాభిమానిని ఇదివరకే ‘పంజా’ ఆడియో వేడుకలో వేలాది మంది ఫ్యాన్స్ మధ్య సన్మానం చేశారు కూడా. ఆ సన్మానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తూ.. ఇదిగో ఈ వీరాభిమాని ఇప్పుడు సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారంటూ అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

ఇదీ అసలు విషయం...

ఐఐటీ జేఈఈలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థి పృథ్వి తేజను ‘పంజా’ ఆడియో వేడుకలో పవన్ సన్మానించి అభినందించారు. అంతేకాదు.. ఉన్నతశిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు కూడా. అయితే పట్టు వీడని విక్రమార్కుడిలా చదివిన పృథ్వీ సివిల్స్‌లో 24వ ర్యాంక్ సాధించి తన కలను నెరవేర్చుకున్నారు. ఇటీవలే మదనపల్లె (చిత్తూరు జిల్లా) సబ్ కలెక్టర్‌గా పృథ్వీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. పవన్ అభిమాని సబ్ కలెక్టర్ కావడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos