పుష్ప పార్ట్ 2 : పాన్ ఇండియా క్రేజ్.. ఈ సారి రెమ్యూనరేషన్ కింద ‘‘హిందీ’’ రైట్స్ అడుగుతోన్న బన్నీ..?

  • IndiaGlitz, [Sunday,March 20 2022]

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘‘పుష్ప’’ సినిమా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్నీ కావు. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్, ఫైట్స్‌ ప్రజలను విశేషంగా అలరించాయి. ఎక్కడ చూసినా కూడా పుష్ప పేరు బాగా వినిపించింది.వయసుతో సంబంధం లేకుండా ‘‘తగ్గేదే లే’’ అంటూ పుష్ప సినిమా డైలాగ్స్, అల్లు అర్జున్ మేనరిజాన్ని అనుకరించారు. వీరిలో సినీతారలు, క్రీడాకారులు చివరికి రాజకీయ నాయకులు కూడా వున్నారు. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పలు పార్టీలు ప్రచారానికి పుష్ప సినిమాను వాడుకున్నారు.

పుష్ప సినిమాను భాషతో సంబంధం లేకుండా దేశప్రజలు ఓన్ చేసుకొని సెలబ్రేట్ చేసుకొంటున్నారు. ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు వసూలు చేయడంతో పాటు హిందీ జనాల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. పుష్ప పార్ట్ 1 ఇచ్చిన ఉత్సాహంతో ‘‘పుష్ప సెకండ్ పార్ట్’’ను పట్టాలెక్కించే పని మొదలుపెట్టారు మేకర్స్. త్వరలోనే రెగ్యులర్ షూటింగుకి వెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొదటి భాగానికి మించి ఈ సినిమాలో స్టెప్పులు .. ఫైట్లు ఉండాలని సుకుమార్ తో బన్నీ చెప్పినట్లుగా ఫిలింనగర్ టాక్. దాంతో యాక్షన్ కొరియోగ్రఫర్లు .. డాన్స్ కొరియోగ్రఫర్లు కసరత్తు మొదలెట్టారని సమాచారం.

పుష్ప రెండవ భాగానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాకు గాను అల్లు అర్జున్ తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేశారట. తన పారితోషికం కింద హిందీ రైట్స్ డిమాండ్ చేస్తున్నారట. హిందీలో బన్నీ తండ్రి నిర్మాత అల్లు అరవింద్‌కు మంచి పలుకుబడి వుంది. అలాగే గతంలో ఎన్నో సినిమాలను అరవింద్ హిందీలో నిర్మించడం, పంపిణీ చేయడం లాంటివి చేశారు. ఈ కారణం చేతే అల్లు అర్జున్ ఈ స్టెప్ తీసుకున్నారని ఫిలింనగర్ టాక్. అంతేకాదు.. ఒకవేళ సినిమా బాగా ఆడితే రెమ్యూనరేషన్‌ను మించి ముడుతుందని బన్నీ ఆలోచన. మరి ఈ విషయంలో నిజమెంత వుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More News

నన్ను వాడుకొని వదిలేశారు, ఎన్నో సార్లు మోసపోయా : మోహన్ బాబు ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవితంలో తాను ఎంతోమందికి ఉపయోగపడ్డానని..

ఊర మాస్ లుక్‌లో నేచురల్ స్టార్ .. అంచనాలు పెంచేస్తోన్న ‘దసరా’ పోస్టర్

ఫ్యామిలీ, లవ్, కామెడీ సినిమాలు చేస్తూ కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వచ్చిన నేచురల్ స్టార్ నానీ..

మా కోసం ఆయన తగ్గి, ఎన్నో మాటలు పడ్డారు.. చిరంజీవే ఇండస్ట్రీ పెద్ద : రాజమౌళి వ్యాఖ్యలు

కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర్‌లో జరిగిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా దర్శకుడు రాజమౌళి ..

జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ కేసులో ట్విస్ట్.. కారులో ఎమ్మెల్యే కుమారుడు, ధ్రువీకరించిన పోలీసులు

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్విస్టులు మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సీపీఎం వ్యవస్థాపక సభ్యురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూశారు.