close
Choose your channels

నన్ను వాడుకొని వదిలేశారు, ఎన్నో సార్లు మోసపోయా : మోహన్ బాబు ఎమోషనల్ కామెంట్స్

Sunday, March 20, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవితంలో తాను ఎంతోమందికి ఉపయోగపడ్డానని.. కానీ తనను మాత్రం అంతా వాడుకుని వదిలేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఆవరణలో మార్చి 19న మోహన్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అందరి చేతుల్లో ఎన్నో రకాలుగా మోసపోయానని, ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నానని మోహన్ బాబు చెప్పారు. ఏడేళ్ల పాటు తిండిలేక, రెండు జతల బట్టలతో కారు షెడ్‌లో గడిపానని ఆయన తెలిపారు.

అసలు జీవితమంటే ఏంటో ఇప్పుడిప్పుడే తెలుస్తుందంటూ మోహన్ బాబు ఎమోషనల్ అయ్యారు. తనతో కొందరు రాజకీయనాయకులు ప్రచారం చేయించుకున్నారని.. తనకు మాత్రం ఎవరూ ఏదీ చేయలేదని ఆయన ఆరోపించారు. తను కూడా వాళ్ల సాయం కోరనని మోహన్ బాబు తేల్చిచెప్పారు. 30 ఏళ్ల క్రితం తాను స్థాపించిన శ్రీవిద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నేడు యూనివర్సిటీ స్థాయికి ఎదగడం వెనక ఎంతో శ్రమ ఉందని ఆయన గుర్తుచేశారు.

తాను ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ మోహన్ బాబు ప్రకటించిన నేపథ్యంలో ఆయన చేసిన ఈ తాజా కామెంట్స్ పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలు టీడీపీని ఉద్దేశించినవా.. లేదంటే వైసీపీని టార్గెట్ చేశారా అంటూ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చకు దారి తీసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.