పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన అల్లు అర్జున్.. ఫోటోను తడుముతూ బన్నీ భావోద్వేగం

  • IndiaGlitz, [Thursday,February 03 2022]

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం నుంచి ఇంకా చిత్ర పరిశ్రమ, అభిమానులు, సన్నిహితులు కోలుకోలేదు. నిత్యం ఎక్కడో ఒక చోట ఆయన ప్రస్తావన వస్తూనే వుంది. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, వందల మంది ఆడపిల్లలకు ఉచిత విద్య అందించడంతో పాటు నటుడు, నిర్మాత, సింగర్, హోస్ట్‌గా పునీత్ వేసిన ముద్ర సాధారణమైనది కాదు. ఇక స్నేహానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు పునీత్ రాజ్‌కుమార్. అందుకే ఆయనకు శాండిల్‌వుడ్‌తో పాటు యావత్ భారతీయ సినీ రంగంలో మంచి ఫ్రెండ్స్ వున్నారు.

తాజాగా పునీత్ రాజ్‌కుమార్‌ కుటుంబాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించారు. గురువారం బెంగళూరు వెళ్లిన బన్నీ.. నేరుగా పునీత్ ఇంటికి చేరుకున్నారు. పునీత్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం కంఠీరవ స్టేడియంలో పునీత్‌ సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు అల్లు అర్జున్.

కొద్దిరోజుల క్రితం మెగా పవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. పునీత్‌ చ‌నిపోవ‌డం మా కుటుంబంలో వ్య‌క్తిని పొగొట్టుకున్నంత బాధ‌గా ఉందని చరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మా ఇంటికొస్తే ఆయ‌న ముందు మేమే గెస్ట్‌లాగా ఫీల‌య్యేలా చేస్తారని... వ్య‌క్తుల‌ను సొంతవాళ్ల‌లా చూసుకుంటారని రామ్‌చరణ్ అన్నారు. సినీ పరిశ్రమకు, సోసైటీకి పునీత్ ఎంతో సేవ చేశారని చెర్రీ ప్రశంసించారు.

More News

కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న 'సెబాస్టియన్' పి.సి.524

రాజావారు రాణి గారు వంటి సూపర్ హిట్ సినిమాతో హీరోగా పరిచయమై "యస్.ఆర్. కళ్యాణమండపం" సినిమా తో బ్లాక్ బస్టర్ సాదించి ప్రేక్షకులలో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు కిరణ్ అబ్బవరం. మంచి కథలను

సినిమా ప్రారంభమైన రెండు నిమిషాలకే 'సెహరి' ప్రపంచంలోకి వెళ్తారు - దర్శకుడు జ్ఞానశేఖర్‌ ద్వారక

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ‘సెహరి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జ్ఞానశేఖర్‌ ద్వారక.

పోలీసుల ఆంక్షలు ఛేదించి.. భద్రతా వలయాన్ని దాటుకుని, బెజవాడ చేరుకున్న ఉద్యోగులు

పీఆర్సీ విషయంగా ఏపీ ప్రభుత్వానికి- ఉద్యోగ సంఘాలకు మధ్య వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. పలు దఫాలుగా వారిని చర్చలకు ఆహ్వానించినా.. ఉద్యోగులు మాత్రం హాజరుకాలేదు.

గ్రాండ్‌గా మహేశ్- త్రివిక్రమ్ మూవీ లాంచ్

సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఖుషీ అయ్యే న్యూస్.. దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేశ్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూవీ పట్టాలెక్కింది. SSMB 28 వర్కింగ్ టైటిల్‌తో వున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు గురువారం

ఇంకా రిలీజ్ కాలేదు.. అప్పుడే ఓటీటీ గురించి టాక్, సర్కార్ వారి పాటను అమెజాన్ కొనేసిందా..?

సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరో పరశు రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘‘సర్కార్ వారి పాట’’ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. సమ్మర్ కనుకగా మే 12న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్