close
Choose your channels

పోలీసుల ఆంక్షలు ఛేదించి.. భద్రతా వలయాన్ని దాటుకుని, బెజవాడ చేరుకున్న ఉద్యోగులు

Thursday, February 3, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పోలీసుల ఆంక్షలు ఛేదించి.. భద్రతా వలయాన్ని దాటుకుని, బెజవాడ చేరుకున్న ఉద్యోగులు

పీఆర్సీ విషయంగా ఏపీ ప్రభుత్వానికి- ఉద్యోగ సంఘాలకు మధ్య వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. పలు దఫాలుగా వారిని చర్చలకు ఆహ్వానించినా.. ఉద్యోగులు మాత్రం హాజరుకాలేదు. దీంతో చిర్రెత్తిపోయిన మంత్రులు.. ఇక ఎదురుచూపులు వుండవని, వాళ్లు వస్తేనే మాట్లాడతామంటూ వ్యాఖ్యానించారు. దీనికి తోడు కొత్త పీఆర్సీ అమలు చేయాలని పట్టుదల ప్రదర్శించిన ప్రభుత్వం.. అనుకున్న ప్రకారం ఆదివారమైనా ట్రెజరీ ఉద్యోగుల్ని పనిచేయించి, జీతాలు ప్రాసెస్ చేయించింది.

ఇకపోతే.. ఈరోజున ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి ఉద్యోగ సంఘాలు. కానీ దానికి అనుమతి లేదని పోలీసులు నగరంలో ఆంక్షలు విధించారు. జిల్లాల్లో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాలు చేసినా భద్రతా వలయాలను ఛేదించుకుని మరీ వేలాది మంది ఉద్యోగులు విజయవాడ చేరుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎన్జీవో భవన్‌ నుంచి అలంకార్‌ థియేటర్‌ కూడలి మీదుగా బీఆర్‌టీఎస్‌ రోడ్డు వైపు ర్యాలీగా వెళ్లారు.

ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పారు. తమను అణచివేసే ప్రయత్నాలు చేస్తే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.

చలో విజయవాడను అడ్డుకునేందుకు గాను.. పలు జిల్లాల్లో ఉన్నతాధికారులు ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ గురువారం ఆఫీసుకు రావాల్సిందేనని ఆదేశించారు. సెలవులు పెడితే అంగీకరించే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. రెండు రోజుల ముందు నుంచే ఉద్యోగ సంఘం నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేయడంతో అనేక జిల్లాల్లో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.