త‌గ్గేదేలె..  ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ ‘‘పుష్ప’’ దూకుడు, రూ.250 కోట్ల పైమాటే..!!

  • IndiaGlitz, [Saturday,December 11 2021]

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమా మొదటి భాగం 'పుష్పః ది రైజ్‌' పేరిట డిసెంబర్‌ 17న తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.

ఇదిలా వుండగా విడుదలకు ముందే పుష్పకు ప్రీ రిలీజ్ బిజినెస్‌ భారీగా జరిగినట్టు తెలుస్తుంది. ఏకంగా రూ. 250 కోట్ల బిజినెస్‌ జరిగిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. తన లాస్ట్ హిట్ 'అల వైకుంఠపురములో' చిత్రంతో ద్వారా భారీ మార్కెట్‌‌ను సొంతం చేసుకున్నారు బన్నీ. అలాగే రంగస్థలం హిట్‌తో సుకుమార్ సైతం మంచి జోరు మీదున్నారు. దీనికి తోడు 'ఆర్య', 'ఆర్య2' వంటి సినిమాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ కావడంతో పుష్పపై మొదటి నుంచే మంచి హైప్ వుంది. ఈ నేపథ్యంలోనే పలు డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలు ‘‘పుష్ప’’ రైట్స్ కోసం ఎగబడినట్లుగా ఫిలింనగర్ సమాచారం. అన్ని ఏరియాల్లో ఫ్యాన్సీ రేటుకి పుష్ప అమ్ముడు పోయిందని టాక్‌. తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాలం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో థియేట్రిక‌ల్, అలానే నాన్ థియేట్రిక‌ల్ (ఓటిటి, డిజిటిల్ రైట్స్) క‌లుపుకొని 250 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

పుష్పలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటిస్తుండగా.. అనసూయ, సునీల్, ధనుంజయ్, రావు రమేశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ స్పీడ్ పెంచింది. ఇప్పటికే పాటలు, పోస్టర్ల ద్వారా సినిమాపై హైప్ పెంచారు. గత సోమవారం విడుదలైన ట్రైలర్‌, నిన్న బయటకొచ్చిన సమంత ఐటెం సాంగ్‌తో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

More News

ఆసుపత్రిలో చేరిన తమిళ హీరో శింబు.. కరోనా అంటూ ప్రచారం, క్లారిటీ ఇచ్చిన సన్నిహితులు

తమిళ యువనటుడు శింబు అనారోగ్యంతో చెన్నయ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. దాంతో ఆయనకు కరోనా సోకిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

బిబిసి, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ భాగ‌స్వామ్యంతో జీ5 నిర్మిస్తున్న వెబ్ సిరీస్ 'గాలివాన‌'

'జీ 5'... ఓటీటీ వేదిక మాత్రమే కాదు, అంతకు మించి! ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో మనసులను తాకే కథలను చెప్పడానికి ప్రయత్నిస్తుంది.

శ్యామ్ సింగ రాయ్ ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ - నిర్మాత వెంకట్ బోయనపల్లి

న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని  నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: ‘‘ఔను సిరిని కంట్రోల్ చేస్తున్నా’’.. హౌస్‌మేట్స్‌ ముందు ఒప్పుకున్న షన్నూ

బిగ్‌బాస్ 5 తెలుగులో ప్రేక్షకులను ఓట్లు అడిగే టాస్క్ కొనసాగుతోంది. హౌస్‌మేట్స్ తమ పర్మార్మెన్స్‌తో ఆకట్టుకుంటున్నారు.

హెలికాఫ్టర్ ప్రమాదం: సాయితేజ మృతదేహం గుర్తింపులో జాప్యం.. ఆధారమైన ‘‘పచ్చబొట్టు’’

తమిళనాడులోని నీలగిరి కొండల్లో జరిగిన ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా 13 మంది సైనిక సిబ్బంది