పారిస్ లో బన్ని స్పెషల్ సాంగ్

  • IndiaGlitz, [Saturday,January 13 2018]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. రచయితగా అందరి మన్నన‌లను పొందిన వక్కంతం వంశీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. జనవరి 1న విడుదల చేసిన ఫస్ట్ ఇంపాక్ట్' ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. అలాగే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ బాగా శ్రమిస్తున్నారని...గతంలో చిత్ర ద‌ర్శ‌కుడు వంశీ చెప్పారు. ఫ‌స్ట్ ఇంపాక్ట్ చూసిన వాళ్ళంతా కూడా ఇప్పుడు బ‌న్ని మేకోవ‌ర్‌కి ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే..పారిస్‌లో అల్లు అర్జున్‌పై ఒక స్పెషల్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారమ్‌. ఈ పాట చిత్రీకరణ కోసం ఇప్పటికే పారిస్‌లో గల ప‌లు లొకేషన్స్‌ని కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్ర‌ముఖ‌ బాలీవుడ్ కొరియోగ్రాఫర్‌ నృత్య ద‌ర్శ‌క‌త్వంలో పలు ఇంటర్నేషనల్ డాన్సర్స్‌తో ఈ పాటను చిత్రీకరించనున్నట్లు ఇండస్ట్రీ టాక్. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి బాలీవుడ్ ద్వయం విశాల్, శేఖర్ సంగీతమందిస్తున్నారు. నాగబాబు సమర్పణలో లగడపాటి శ్రీధర్, బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

దర్శకుడి మాట - మనస్సుకు దగ్గరైన 'మిఠాయి'

హలో ఫ్రెండ్స్,ఈ అనౌన్స్మెంట్ కి టైం పట్టింది.నిజం చెప్పాలంటే అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ టైంనే తీసుకున్నా.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో సంక్రాంతి జరుపుకున్న నటి మంచు లక్ష్మి

ప్రముఖ సినీనటి,నిర్మాత మంచులక్ష్మి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో ఫిల్మ్ నగర్ లోని

'గాయత్రి' టీజర్ విడుదల!

డా.మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన‘గాయత్రి’చిత్ర టీజర్ నేడు విడుదలైనది.

ఈ నెల 17న టీఎస్సార్ 'కాకతీయ కళా వైభవ మహోత్సవం'

ఎప్పుడూ కళలను,కళాకారులను గౌరవిస్తూ,ప్రోత్సహించే మంచి మనసున్న మనిషి 'కళాబంధు'టి.సుబ్బరామిరెడ్డి.

చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన 'జువ్వ' ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టీజర్!

రంజిత్,పాలక్ లల్వానీ జంటగా'దిక్కులు చూడకు రామయ్య' ఫేమ్ త్రికోటి పేట దర్శకత్వంలో రూపొంతోన్నచిత్రం 'జువ్వ'.