కొత్త లెక్క‌లు చెబుతున్న అల్లు శిరీష్..!

  • IndiaGlitz, [Thursday,August 25 2016]

అల్లు శిరీష్ హీరోగా ప‌రుశురామ్ తెర‌కెక్కించిన చిత్రం శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు. ఈ చిత్రం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో మూడ‌వ వారంలోను విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మౌతుంది. గ‌తంలో సినిమా రేంజ్ గురించి చెప్పాలంటే...మా సినిమా ఇన్నిసెంట‌ర్స్ లో 50 రోజులు, 100 రోజులు ఆడింద‌ని గొప్ప‌గా చెప్పేవారు. ప్ర‌జెంట్...మా సినిమా ఇంత కలెక్ట్ చేసింది అంటూ క‌లెక్ష‌న్స్ చెబుతున్నారు.

అయితే...అల్లు శిరీష్ న‌టించిన శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు 32 ల‌క్ష‌లు మంది చూసారు అంటూ కొత్త లెక్క‌లు చెబుతున్నారు. రెండోవారం కంటే మూడ‌వ వారంలో క‌లెక్ష‌న్స్ బాగున్నాయి. జ‌న‌ర‌ల్ గా రోజురోజుకి క‌లెక్ష‌న్స్ త‌గ్గిపోతుంటాయి కానీ..మా సినిమా రోజురోజుకు క‌లెక్ష‌న్స్ పెరుగుతున్నాయి. గ‌త ప‌ది రోజులుగా ఏ పెద్ద సినిమా రిలీజ్ కాలేదు. అందుచేత బాక్సా ఫీస్ వ‌ద్ద శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు క‌లెక్ష‌న్స్ ఇంకొన్ని రోజులు స్ట‌డీగా ఉంటాయి అంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా రేంజ్ చెప్పాలంటే... సెంట‌ర్స్, క‌లెక్ష‌న్స్ చెప్పే సినీజ‌నం భ‌విష్య‌త్ లో మా సినిమాని ఇంత‌ మంది చూసారు అంటూ ఆడియోన్స్ లెక్క‌లు చెబుతారేమో..!

More News

చంపుకునే స్ధాయిలో అభిమానం ఉండకూడదు - పవన్ కళ్యాణ్..!

ఇటీవల కర్నాటకలో పవన్ కళ్యాణ్ అభిమాని వినోద్ రాయల్ హత్యకు గురయ్యారు.

గీతా ఆర్ట్స్ ర‌హస్యాన్ని బ‌య‌ట‌పెట్టిన అల్లు శిరీష్..!

గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రంతో స‌క్సెస్ సాధించిన విష‌యం తెలిసిందే. సోష‌ల్ మీడియాలో బాగా ఏక్టివ్ గా ఉండే అల్లు శిరీష్ కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ లో...ప్ర‌పంచానికి భ‌గ‌వ‌ద్గీత అందించిన శ్రీకృష్ణకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌చేస్తున్నాను.

బ్రిక్స్ చిత్రోత్స‌వంలో 'బాహుబ‌లి'

ప్ర‌భాస్‌, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో రూపొందిన సెన్సేష‌న‌ల్ మూవీ `బాహుబ‌లి ది బిగినింగ్`ఇండియ‌న్ సినిమాలో తెలుగు సినిమా రేంజ్‌ను పెంచిన చిత్రంగా పేరు సంపాదించుకుంది.

బాల‌కృష్ణ దృష్టి ప‌డింది

నంద‌మూరి బాల‌కృష్ణ నటుడిగానే కాకుండా రాజ‌కీయ నాయ‌కుడిగా కూడా రాణిస్తున్నారు. ఇప్పుడు వ్యాపారం రంగంలోకి అడుగు పెడుతున్నారు.

పెళ్లిచూపులు హీరో ద్వార‌క టీజ‌ర్ రిలీజ్..!

పెళ్లిచూపులు సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న తాజా చిత్రం ద్వారక‌. ఈ చిత్రాన్ని సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ద్యుమ్న చంద్ర‌పాటి, గ‌ణేష్ పెనుబోతు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.