ఆటా మహాసభలకు ఎర్రబెల్లికి ఆహ్వానం.. తప్పక వస్తానన్న మంత్రి

అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ 17వ మహాసభలు జూలై 1 నుంచి జూలై 3 తేదీ వరకు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఆహ్వానించారు నిర్వాహకులు. ఈ సందర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ.. ఆటా స‌భ‌ల‌కు తాను గ‌తంలోనూ వెళ్ళాన‌ని చెప్పారు. అమెరికా వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా పండుగ‌గా నిర్వ‌హించుకునే ఈ వేడుక‌లు అత్యంత వైభ‌వంగా జ‌రుగుతాయ‌ని ఎర్రబెల్లి తెలిపారు. ఆటా ప్ర‌తినిధుల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ, తాను త‌ప్ప‌క హాజరవుతానని మంత్రి హామీ ఇచ్చారు.

ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుని కలిసిన వారిలో ఆటా ప్ర‌తినిధులు జ‌యంత్ చ‌ల్లా, శ‌ర‌త్ వేముల‌, రఘువీర్ రెడ్డి, స‌న్నీ రెడ్డి వున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. 1990లో ఏర్పడిన ‘‘ఆటా’’ అమెరికాలో తెలుగు క‌ళ‌లు, సంప్ర‌దాయాలు, సంస్కృతీ ప‌రిర‌క్ష‌ణ‌కు పాటుపడుతోందని తెలిపారు. ప్ర‌తి రెండేండ్లకోసారి జ‌రిగే ఈ మ‌హాస‌భ‌ల‌కు వివిధ రంగాల‌కు చెందిన తెలుగు వారిని ఆహ్వానించి పలు అంశాల‌పై చ‌ర్చిస్తామ‌ని వారు వెల్లడించారు.

ఇకపోతే... ఈసారి ఆటా సభలకు దాదాపు 15,000 మందికి పైగా హాజరవుతారని అంచనా. ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. కరోనా మహమ్మారి కారణంగా గడిచిన రెండేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. ప్రస్తుతం అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా వైరస్ అదుపులోకి రావడంతో ఈసారి తెలుగు మహాసభలను భారీఎత్తున నిర్వహించాలని ఆటా నిర్వాహక కమిటీ నిర్ణయించింది. సభల నిర్వహణకు సంబంధించి 65 కమిటీలను ఏర్పాటు చేశామని ఆటా ప్రెసిడెంట్‌ భువనేష్‌ బూజల మీడియాకు తెలిపారు. ఇందులో దాదాపు 350 మందిని సభ్యులుగా ఎన్నుకున్నట్లు తెలిపారు. వీరంతా మహాసభలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తారని భువనేష్ వెల్లడించారు.

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మవిభూషణ్ జగ్గీ వాసుదేవ్ (సద్గురు) , ప్రముఖ కవులు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ , రకుల్ ప్రీత్ సింగ్ , గాయకుడు రాం మిరియాల ఆటా సభలకు హాజరుకానున్నారు. అలాగే దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా ఆధ్వర్యంలో సంగీత విభావరికి ఏర్పాట్లు చేస్తున్నారు.

More News

జగన్‌ను కలిసిన ఆటా ప్రతినిధులు.. తెలుగు మహాసభలకు రావాలంటూ ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆటా (అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌) ప్రతినిధులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో

నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా 'ముత్తయ్య' టీజర్ విడుదల

జీవితంలో ఒక్క సినిమాలోనైనా నటించాలని కోరుకునే వ్యక్తి ముత్తయ్య. అతని కోరిక నెరవేరిందా లేదా అనే ఆసక్తిని కలిగిస్తూ సాగింది "ముత్తయ్య" సినిమా టీజర్.

ఇప్పటికీ సమైక్యవాదినే.. టీఆర్ఎస్‌లో సమైక్యవాదులు లేరా, కేసీఆర్‌నే కొడతానన్నారు: జగ్గారెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్ధితులు, పరిపాలనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే.

ఏలూరు జిల్లాలో వైసీపీ నేత దారుణహత్య.. ఎమ్మెల్యేని చితకబాదిన స్థానికులు, ఉద్రిక్తత

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. జి.కొత్తపల్లికి చెందిన అధికార వైసీపీ నేత గంజి ప్రసాద్‌‌ను

‘‘ఆచార్య’’ ఇంటికి మంత్రిగారు..!!

ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా హైదరాబాదులో బిజిబిజీగా గడుపుతున్నారు. తొలుత ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో