close
Choose your channels

ఏలూరు జిల్లాలో వైసీపీ నేత దారుణహత్య.. ఎమ్మెల్యేని చితకబాదిన స్థానికులు, ఉద్రిక్తత

Saturday, April 30, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. జి.కొత్తపల్లికి చెందిన అధికార వైసీపీ నేత గంజి ప్రసాద్‌‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు గాను జి.కొత్తపల్లికి వెళ్లారు.

అయితే ఈ హత్యకు ఎమ్మెల్యే అనుచరుడే కారణమని గ్రామస్తులు, మృతుడు ప్రసాద్ వర్గీయులు తలారిపై మూకుమ్మడిగా దాడికి దిగారు. అంతేకాదు రక్షించడానికి యత్నించిన పోలీసులపైనా దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సహా పలువురికి గాయాలయ్యాయి. జి.కొత్తపల్లిలో ఇరువర్గాల మధ్య ఆధిపత్యపు పోరులో వైసీపీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గంజి ప్రసాద్‌ను దుండగులు నరికి చంపినట్లుగా తెలుస్తోంది. ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో అదనపు బలగాలు గ్రామంలో భారీగా మోహరించాయి. చివరికి పోలీసుల రక్షణలో ఎమ్మెల్యే తలారి అక్కడి నుంచి బయటపడ్డారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.