ర‌వితేజ స‌ర‌స‌న బ్రిటిష్ భామ‌

  • IndiaGlitz, [Monday,December 21 2015]

మాస్ మ‌హారాజా ర‌వితేజ బెంగాల్ టైగ‌ర్' స‌క్సెస్ త‌ర్వాత వెంట‌నే సినిమా స్టార్ట్ చేయ‌డం లేదు. ఇప్పుడు రెండు సినిమాలతో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ రెండు చిత్రాల్లో ఓ మై ఫ్రెండ్ ఫేమ్' వేణుశ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. అలాగే మ‌రో కొత్త ద‌ర్శ‌కుడు చ‌క్రి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేంటే ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న ఎమీజాక్స‌న్ హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ట‌. గ‌తంలో రామ్‌చ‌ర‌ణ్ ఎవ‌డు చిత్రంలో చిన్న పాత్ర‌లో తళుక్కుమ‌న్న ఈ బ్రిటిష్ సుంద‌రాంగి ఇప్పుడు మ‌రోసారి ర‌వితేజ స‌ర‌స‌న న‌టించ‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే ఎమీ జాక్స‌న్ శంక‌ర్ రోబో సీక్వెల్ 2.0'లో న‌టిస్తుంది. మ‌రి ఎమీజాక్స‌న్‌ను తెలుగు సినిమాలో న‌టించ‌డానికి శంక‌ర్ ఒప్పుకుంటాడో లేదో...

More News

'డిక్టేటర్' ఆడియో విడుదల

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా నిర్మాణ రంగంలో అతిపెద్ద నిర్మాణ సంస్థగా పేరున్న ఈరోస్ ఇంటర్నేషనల్,వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న బారీ బడ్జెట్ మూవీ 'డిక్టేటర్'.

సోగ్గాడే కార‌ణంగా వెన‌క్కి వెళుతున్న‌

నాగార్జున‌, కార్తీ, త‌మ‌న్నా ప్ర‌ధాన తారాగ‌ణంగా పివిపి సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఊపిరి. ఈ సినిమా ను ఫిభ్ర‌వ‌రి 5న విడుద‌ల చేయాల‌నుకున్నారు.

'మామ మంచు అల్లుడు కంచు' ఆడియో సక్సెస్ మీట్...

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా, అల్లరి నరేష్, పూర్ణ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘మామమంచు..అల్లుడు కంచు’. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రెడ్డి తీర్చిదిద్దారు.

'ఎక్స్ ప్రెస్ రాజా' ఆడియో విడుదల

శర్వానంద్, సురభి జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ , ప్రమోద్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా.

చ‌ర‌ణ్ మూవీకి ముహుర్తం ఫిక్స్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు.