రాజమౌళి మల్టీస్టారర్ మూవీలో మరో హీరో

  • IndiaGlitz, [Wednesday,January 31 2018]

బాహుబ‌లి సీరీస్‌తో తెలుగు సినిమా స‌త్తాను ప్ర‌పంచానికి చాటి చెప్పారు రాజ‌మౌళి. ప్ర‌స్తుతం ఆయ‌న విరామం తీసుకుంటున్నారు. అలాగే, అక్టోబ‌ర్ నుంచి త‌న కొత్త చిత్రాన్ని ప‌ట్టాలెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ని తెలిసింది. మ‌ల్టీస్టార‌ర్ మూవీగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అన్న‌ద‌మ్ములుగా న‌టించ‌నున్నార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

కుటుంబ క‌థా చిత్రంగా తెర‌కెక్క‌నున్న ఈ మూవీకి సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఫిల్మ్‌న‌గ‌ర్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇంత‌కీ అదేమిటంటే.. ఈ చిత్రంలో మ‌రో హీరో కూడా న‌టించే అవ‌కాశ‌ముంద‌ట‌. అయితే.. ఆ హీరో విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. బాహుబ‌లితో రానా ఎలాగైతే ప్ర‌తినాయ‌కుడిగా అవ‌తార‌మెత్తి మెప్పించారో.. ఆ త‌ర‌హాలోనే స‌ద‌రు క‌థానాయ‌కుడు విల‌న్‌గా అవ‌తార‌మెత్త‌నున్నార‌ట‌.. అయితే.. ఆ హీరో ఎవ‌రు? అనే విష‌యం మాత్రం బ‌య‌ట‌కు రాలేదు. మొత్తానికి.. సినిమా ప్రారంభం కాక‌ముందే రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్ వార్త‌ల్లో నిలుస్తోంది.

More News

ముచ్చటగా మూడు సినిమాలతో..

ఒక లైలా కోసం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఉత్తరాది భామ పూజా హెగ్డే.

పెళ్లిపై వస్తున్న వన్నీ రూమర్సే.. శౌర్య

యువ కథానాయకుడు నాగ శౌర్య ఈ శుక్రవారం అంటే ఫిబ్రవరి 2న 'ఛలో'

ఒకరోజు ఆలస్యంగా 'తొలిప్రేమ'

వరుణ్తేజ్,రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం 'తొలిప్రేమ'.

మణిరత్నం కు లైకా సపోర్ట్...

ఇండియన్ ఏస్ డైరెక్టర్ మణిరత్నం ఇప్పుడు తన తదుపరి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అయిపోయారు.

కిర్రాక్ పార్టీ టీజింగ్ ట్రైలర్ ను విడుదల చేసిన డైరెక్టర్ తేజ...

మంచి కథలను ఎంపిక చేసుకొని వరుస విజయాలతో దూసుకెళుతున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ తాజాగా ఎ టివి సమర్పణలో