టాలీవుడ్లోకి మరో కొత్త హీరోయిన్
- IndiaGlitz, [Wednesday,July 17 2019]
టాలీవుడ్లోకి కొత్త హీరోయిన్స్కు స్థానం ఎప్పుడూ ఉంటుంది. మాలీవుడ్, శాండిల్ వుడ్ హీరోయిన్స్ హవా ఈ మధ్య ఎక్కువ అవుతుంది. పూజా హెగ్డే, రష్మిక, నభా నటేశ్లు వరుస సినిమాలు చేస్తున్నారు. కాగా.. ఇప్పుడు మరో కన్నడ భామ తెలుగు సినీ రంగ ప్రవేశం చేయనుంది. శర్వానంద్ హీరోగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై కిశోర్ రెడ్డి దర్శకత్వంలో 'శ్రీకారం' సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా కన్నడ సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఆషికా రంగనాథ్ను హీరోయిన్గా ఎంపిక చేశారట. త్వరలోనే అధికారిక సమాచారం రానుంది. ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తుండగా.. మిక్కి జె.మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.