చంద్రబాబుకు మరో ఊహించని షాక్.. బీజేపీలోకి కీలకనేత!

  • IndiaGlitz, [Monday,June 24 2019]

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీకి పరిస్థితులు అనుకూలించట్లేదు. ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైన తర్వాత ఒక్కొక్కరుగా కీలక నేతలు, రాజకీయ ఉద్ధండులంతా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి టాటా చెప్పి బీజేపీలో చేరడంతో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలినట్లైంది. మరోవైపు అదే బాటలో మరికొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం ఉన్నారన్న ప్రకటన టీడీపీని కలవరపెడుతోంది. ఓ వైపు టీడీపీ అధినేత విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఇలా వరుస షాక్‌లు తగులుతుండటం.. ఎప్పుడెవరు ఏ పార్టీలోకి జంప్ అవుతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సీనియర్, కీలక నేత అంబికా కృష్ణ రూపంలో మరో ఊహించని షాక్ ఎదురైంది. సోమవారం ఢిల్లీలో బీజేపీ కీలక నేతల్లో ఒకరైన రామ్‌మాధవ్‌ సమక్షంలో అంబికా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతో పాటు సోదరుడు అంబికా రాజా కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏపీ ఫిల్మ్‌, థియేటర్‌, టెలివిజన్‌ కార్పొరేషన్‌ ఛైర్మెన్‌గా అంబికా కృష్ణ కొనసాగిన విషయం విదితమే. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఏపీఎఫ్‌డీసీకి ఇటీవలే ఆయన రాజీనామా చేశారు. రాజకీయ నేతలతో పాటు సినీ పరిశ్రమతో కూడా అంబికా కృష్ణకు సన్నిహిత సంబంధాలున్నాయన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే టీడీపీకి ఆర్థికంగా అండగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్‌ పార్టీకి గుడ్ బై చెప్పగా.. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్తగా, పార్టీకి అండగా అంబికా కూడా జంప్ అవ్వడంతో టీడీపీకి కోలుకోలేని ఎదురుదెబ్బేనని విశ్లేషకులు చెబుతున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని చంద్రబాబు అమరావతికి రాబోతున్నారు. అయితే చంద్రబాబు వచ్చాక పరిణామాలు ఎలా ఉంటాయో..? ఎంతమందిని పార్టీ మారకుండా ఆయన నిలువరిస్తారో వేచి చూడాల్సిందే మరి.

More News

సినిమా మీద నమ్మకం ఉంది కాబట్టే మూడు భాషల్లో ఉండిపోరాదే చిత్రం నిర్మించా - నిర్మాత డా.లింగేశ్వర్

గోల్డ్ టైమ్ ఇన్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై త‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా న‌వీన్ నాయ‌ని ద‌ర్శ‌క‌త్వంలో

సైరాలో ఝాన్సీ పాత్ర‌లో ..

మెగాస్టార్ 151వ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి` నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

ప్రజావేదిక అక్రమ నిర్మాణం.. ఎల్లుండి కూల్చేస్తాం!

‘ప్రజావేదిక’ ఈ పేరు వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కువ సార్లు వార్తల్లో వినిపించిన పేరు.

అందమైన ఆదివారం మెగా హీరోలు కలుసుకున్న వేళ..!

అవును.. మెగా హీరోలందరూ చాలా గ్యాప్ తర్వాత లవ్లీ సండే నాడు కలుసుకున్నారు. ఈ కలయికకు సాయిధరమ్ తేజ్ ఇళ్లు వేదికైంది.

'జైసేన' మొదటి పాట 'యుద్ధం చెయ్' విడుదల

శ్రీకాంత్‌, సునీల్‌, శ్రీ, పృథ్వి , ప్రవీణ్‌, కార్తికేయ ప్రధాన తారాగణంగా వి.విజయలక్ష్మి సమర్పణలో