తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వాటిపై విచారణ..

  • IndiaGlitz, [Saturday,February 10 2024]

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికితీసే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని తేల్చేందుకు జ్యూడీషియల్, విజిలెన్స్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. టీఎస్‌ఆర్టీసీ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన 100 ఆర్టీసీ బస్సులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం నిర్మాణాలలో అవినీతి జరిగిందని.. వీటిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. తెలంగాణను అబద్ధాల పునాదుల మీద గత ప్రభుత్వం నడిపిందని మండిపడ్డారు. కేవలం ఇరిగేషన్‌కే రూ.16వేల కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుందని తెలిపారు. ఇది గత సర్కార్ చేసిన పాపం అని దుయ్యబట్టారు. కమీషన్ల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడిపారని ఆయన విమర్శించారు.

తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులది కీలక పాత్ర అని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడితే తమ సమస్యలు పరిష్కారమవుతాయని కార్మికులు ఆశించారని... కానీ అలా జరగలేదన్నారు. గత ప్రభుత్వ హయంలో సమస్యల పరిష్కారం కోసం కార్మికులు చేసిన ఆందోళనలో 36 మంది చనిపోయారని గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించామని.. ఇప్పటి వరకూ 15 కోట్ల మంది మహిళ ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. ఇందుకు ఆర్టీసీ కార్మికుల కృషే కారణమని.. వారిని అభినందిస్తున్నానని తెలిపారు.

అలాగే గత ప్రభుత్వం రూ.2.97లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని.. కానీ తాము వాస్తవ లెక్కలతో గతేడాది కంటే రూ.15వేల కోట్లు తక్కువతో బడ్జెట్‌ ప్రవేశపెట్టామని చెప్పారు. మేడిగడ్డకు వెళ్దామని మాజీ సీఎం కేసీఆర్‌తో సహా శాసన సభ్యులందరినీ ఆహ్వానించామని చెప్పారు. ఈనెల 13న బీఆర్ఎస్ వాళ్లకి సమావేశం ఉంటే వేరే తేదీ చెప్పినా తాము ఆలోచిస్తామన్నారు. ఒకరోజు ముందు అయినా వెనకా అయినా వెళ్లడానికి రెడీ అని రేవంత్ తెలిపారు.

More News

Baby:'బేబీ' సినిమా కథ నాదే.. దర్శకుడు, నిర్మాతలపై కేసు నమోదు..

తెలుగు ఇండస్ట్రీలో కాపీరైట్ వివాదాలు ఎక్కువుతున్నాయి. శ్రీమంతుడు సినిమా కథ వివాదం కొనసాగుతుండగానే తాజాగా బేబీ సినిమా కథ విషయంలో

Amit Shah:ఏపీలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ఎన్నికల వేళ ఏపీలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో

Bharat Ratna:భారతరత్న పురస్కారం విజేతలు ఎవరంటే..? జాబితా ఇదే..

దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న(Bharat Ratna) పురస్కారాన్ని 1954 జనవరి 2న, తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో ప్రారంభించారు.

Telangana Budget:రూ.2.75లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..?

రూ.2లక్షల 75వేల 891కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు.

Eagle:రవితేజ హిట్ కొట్టినట్లేనా..? 'ఈగల్' మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే..?

మాస్ మహారాజా రవితేజ(Raviteja) హీరోగా నటించిన ‘ఈగల్’ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.