మెగా ఫ్యామిలీలో త్వరలో మరో పెళ్లి..

  • IndiaGlitz, [Wednesday,December 16 2020]

మెగా డాటర్ నిహారిక వివాహ వేడుకల ఇటీవలే ముగిసింది. మెగా ఫ్యామిలీ మొత్తం ఆ పెళ్లిలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూసి మెగా అభిమానులు సైతం సంతోషించారు. అయితే త్వరలోనే మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి కూడా జరగనుందని సుప్రీం హీరో సాయితేజ్ మాటలను బట్టి తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయితేజ్ చెప్పిన మాటలు.. ఇప్పుడు అభిమానుల మనసులో సంతోషాన్ని నింపుతున్నాయి. అయితే సాయితేజ్ చెప్పింది తన పెళ్లి గురించి కాదులెండి..

వచ్చే ఏడాది అల్లు శిరీష్ కూడా ఓ ఇంటి వాడు కాబోతున్నాడట. తన పెళ్లి గురించి చెప్పమంటే సాయితేజ్ అల్లు శిరీష్ పెళ్లి విషయాన్ని బయటపెట్టాడు. తన కంటే ముందు శిరీష్‌కే వివాహం జరగవచ్చని చెప్పాడు. తన కంటే శిరీష్ పెద్దని తెలిపాడు. ‘‘శిరీష్ నాకంటే పెద్ద. తను వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకుంటాడు. ఇంటి పెద్ద కొడుకుగా నాకు కొన్ని బాధ్యతలున్నాయి. వాటిని పూర్తి చేయాలి. అయితే పెళ్లి చేసుకోవడం కంటే నాకు సోలోగా ఉంటేనే సంతోషం. చిన్నప్పటి నుంచి చాలా మిస్ అయ్యాను. ఎన్నో కలలున్నాయి. ముందుగా వాటన్నింటినీ నెరవేర్చుకోవాలి’’ అని సాయితేజ్ చెప్పాడు.

అయితే సాయితేజ్.. సైతం ఓ అమ్మాయిని వెతుక్కున్నాడని.. పెళ్లికి సిద్ధమవుతున్నాడంటూ ఇటీవల బాగా వార్తలొచ్చాయి. ఈ విషయమై సాయితేజ్ స్పందిస్తూ.. ఇంకా వెతుక్కోలేదని.. తన తల్లి సంతోషం కోసం పెళ్లి చేసుకుంటానని చెప్పానని వెల్లడించాడు. అమ్మలను బిజీగా పెట్టకుంటే వాళ్లు ఏవేవో చేస్తుంటారని ఫన్నీగా చెప్పాడు. పదే పదే అడుగుతుంటే.. పెళ్లి చేయాలనుకున్నావు కాబట్టి చేసేయమని తన తల్లికి చెప్పానన్నాడు. ప్రస్తుతానికి అయితే తను సోలో లైఫ్‌నే ఎంజాయ్ చేస్తున్నానని సాయితేజ్ వెల్లడించాడు.

More News

రజినీ అభిమానుల్లో ఉన్న ఆనందం.. సాయంత్రానికి ఆవిరి..

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ పార్టీ పెడుతున్న విషయం కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఊహాగానాలకు కొదువ లేకుండా పోతోంది.

అమెజాన్ అనో.. ఫ్లిప్‌కార్ట్ అనో క్లిక్ చేశారో.. అంతే సంగతులు..

మీ మొబైల్‌కి ఒక మెసేజ్ వస్తుంది. పండుగ సందర్భంగా బ్రాండెడ్ వస్తులపై ఫ్లాట్ 45-60 పర్సెంట్ డిస్కౌంట్ అని..

క్రెడిట్ అంతా వరుణ్‌కే.. నిహారికను అమ్మలాగే చూస్తా: సాయితేజ్

మెగా డాటర్ నిహారిక పెళ్లి విషయమై ఓ ఇంటర్వ్యూలో సాయితేజ్ స్పందించాడు. ముందుగా ఆమె పెళ్లి పనుల గురించి మాట్లాడుతూ..

హగ్ చేసుకున్న అఖిల్, అభి.. సందడిగా సాగిన షో..

‘ట్రెండ్ మారినా.. ఫ్రెండ్ మారడే..’ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. ఆ వెంటనే గీతా మాధురి, హరి తేజ, శ్రీముఖి, అలీ రెజాను చూపించారు.

కరోనాతో పోరాడి ఇంటికి చేరిన అనంతరం పక్షవాతానికి గురైన నటి..

కరోనా కారణంగా ఎవరేంటనే విషయం తెలిసొచ్చింది. అసలైన హీరో, హీరోయిన్లు ఎవరనే విషయం తెలిసింది.