'సాహో' సర్‌ఫ్రైజ్ పోస్టర్‌‌ పై అనుష్క కామెంట్..

  • IndiaGlitz, [Tuesday,May 21 2019]

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'సాహో'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై 'బాహుబలి' రికార్డ్స్‌ను బ్రేక్ హిస్టరీ క్రియేట్ చేసేంతలా రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం తెరకెక్కుతుండటంతో అభిమానులు, నటీనటులు, సినీ ప్రియుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా అప్పుడెప్పుడో ప్రభాస్ పుట్టిన రోజు చిన్నపాటి వీడియో క్లిప్, పోస్టర్‌ను విడుదల చేసిన చిత్రబృందం మంగళవారం సర్‌ఫ్రైజ్ ఇస్తానంటూ పోస్టర్‌ను వదిలిన సంగతి తెలిసిందే. 

ఈ పోస్టర్‌ను అభిమానులు మీ సర్‌ఫ్రైజ్ అదిరిపోయింది డార్లింగ్ అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ పోస్టర్‌పై టాలీవుడ్‌లో టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ముదురుభామ, యోగా భామ అనుష్క రియాక్ట్ అయ్యింది. తన ట్విట్టర్ వేదికగా ఈ పోస్టర్‌ను పోస్ట్ చేస్తూ ఆసక్తికర విషయాలు రాసుకొచ్చింది. సో.. మొత్తానికి చూస్తే ఓ వైపు చిత్రబృందం.. మరోవైపు డార్లింగ్.. ఇంకోవైపు అనుష్క కూడా ‘సాహో’కు పెద్ద ఎత్తునే ప్రమోటింగ్ చేసేస్తున్నారన్న మాట.

అనుష్క ట్వీట్ సారాంశం..

ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అంశం..  తర్వాత ఏంటి.. ఏం జరగబోతోంది? అన్న ఆలోచనలో పడేస్తోంది. ప్రతిసారీ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆగస్ట్‌ 15 కోసం ఎంతో ఆతృతగా నేను ఎదురుచూస్తున్నా. ప్రభాస్‌కు, యూవీ క్రియేషన్స్‌కు, సుజిత్‌కు, బృందంలోని ప్రతి టెక్నీషియన్‌కు.. చిత్రబృందంలోని ప్రతి ఒక్కరికీ ఆల్‌ ది బెస్ట్‌. చాలా ఎగ్జైటెడ్‌గా ఉంది అని అనుష్క తన ట్వీట్‌లో రాసుకొచ్చింది.

కాగా.. ఈ ట్వీట్‌ను పలువురు అనుష్క, ప్రభాస్ ఫ్యాన్స్ రి ట్వీట్‌, లైక్‌లు చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే అనుష్క పోస్ట్‌పై ప్రభాస్ ఎలా రియాక్ట్ అవుతాడో వేచి చూడాల్సిందే మరి. ఇదిలా ఉంటే ఈ చిత్రం.. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా అగ‌స్ట్ 15న ప్రపంచ‌ వ్యాప్తంగా ‘సాహో’ భారీ విడుదలకు సిద్ధమవుతోంది.

More News

ఫలితాలకు ముందు ఎమ్మెల్యే దారుణ హత్య...

దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు గాను గురువారం ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

జగన్‌ ఫేస్‌బుక్ పోస్టుతో సీఎం ఎవరో తేలిపోయింది!

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కౌన్‌డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో ఏపీ సీఎం ఎవరో.. ప్రతిపక్షనేత ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే పలు ప్రాంతీయ, జాతీయ మీడియా సంస్థలు

లగడపాటి సర్వే పై మండిపడ్డ మంత్రి

టీడీపీ గెలుస్తుందని.. ఎవరి సపోర్ట్ లేకుండా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన ఆర్జీ ప్లాష్ టీమ్ సర్వేతో తేల్చిన సంగతి తెలిసిందే.

ఫలితాల తర్వాత టీడీపీలో చీలికలు.. నారా వర్సెస్ నందమూరి!?

అవును.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీడీపీ చీలికలు తప్పవని.. నారా వర్సెస్ నందమూరిగా పరిస్థితులు మారే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఓ నేత జోస్యం చెప్పారు.

'విశ్వామిత్ర' సెన్సార్ పూర్తి... జూన్ 14న విడుదల! 

అనగనగా ఓ సాధారణ మధ్యతరగతి అమ్మాయి. జీవితం సంతోషంగా, సాఫీగా సాగుతుందన్న సమయంలో సమస్యలు ఆమెను చుట్టుముడతాయి. వాటిని ఓ అజ్ఞాత వ్యక్తి పరిష్కరిస్తారు.