ఫలితాలకు ముందు ఎమ్మెల్యే దారుణ హత్య...
Send us your feedback to audioarticles@vaarta.com
దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు గాను గురువారం ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీన్నే అదనుగా తీసుకున్న మిలిటెంట్లు రెచ్చిపోతున్నారు. మంగళవారం సాయంత్రం అరుణాచల్ ప్రదేశ్కు చెందిన దక్షిణ కోన్సా ఎమ్మెల్యే తిరోంగ్ అబోను నిషిధిత మిలిటెంట్ గ్రూప్ దారుణంగా హత్య చేసింది.
అబోను తన కుమారుడు, వ్యక్తిగత సిబ్బందితో కలిసి కారులో వెళ్తుండగా అడ్డగించిన మిలిటెంట్స్ దారుణానికి పాల్పడ్డారు. మిలిటెంట్స్ జరిపిన కాల్పుల్లో అబో, ఆయన కుమారుడు, 11మంది వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఘటనాస్థలిలోనే కుప్పకూలిపోయారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అరుణాచల్ ప్రదేశ్ ఉలిక్కి పడింది.
రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనకు పాల్పడిందెవరు..? అసలెందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు..? అని ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇంత వరకూ ఈ దారుణానికి పాల్పడింది తామేనని ఉగ్రవాదులు గానీ నిషేధిత మిలిటెంట్స్ కానీ ప్రకటించలేదు. దీంతో మున్ముంథు దాడులు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావించిన పోలీసులు రాష్ట్రంలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. కాగా ఈ దాడికి పాల్పడింది నాగా మిలిటెంట్స్ అని పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా.. ఈ ఘటనపై ప్రధాన నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్నాథ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్యకు పాల్పడిన వారిని కఠిన శిక్షించాలని పోలీసులను కోరారు. మరోవైపు మేఘాలయా ముఖ్యమంత్రి కోన్రాడ్ కె. సంగ్మా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై అరుణాచల్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు వెనుక రాజకీయ కక్షలు ఉన్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ హత్యపై ఎంక్వయిరీ వేయిస్తున్నట్లు మీడియాకు వివరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.