ఉక్రెయిన్‌లో ఏపీ విద్యార్ధుల అవస్థలు ... విమాన ఖర్చులు భరించండి: అధికారులకు జగన్ ఆదేశం

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అన్ని దేశాలు వారి పౌరుల క్షేమ సమాచారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే భారతీయుల తరలింపుపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ చర్యలు చేపట్టింది. పోలండ్, హంగరీ మీదుగా భారతీయులను తరలించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు కూడా వుండటంతో వారి తరలింపుపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు దృష్టిసారించాయి. ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్, మంత్రి కేటీఆర్‌లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

తాజాగా.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్థులకు విమాన టికెట్లు ప్రభుత్వమే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. టికెట్లు కొనుగోలు చేసుకోలేని విద్యార్థులకు ప్రభుత్వమే భరించాలని ఆయన సూచించారు. ఢిల్లీకి చేరుకునే విద్యార్థులకు అక్కడి నుంచి సొంత ప్రాంతాలకు చేర్పించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అధికారులను ఆదేశించారు. అందుకు తగినట్లు ఏపీ భవన్‌ నుంచి విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

మరోవైపు.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సీనియర్‌ ఐఏఎస్‌ కృష్ణబాబు నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఆర్టీజీఎస్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి, నిత్యం పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. విద్యార్థులకు సహాయ సహకారాలు అందజేస్తున్నారు.

More News

నల్గొండలో కుప్పకూలిన హెలికాఫ్టర్... ఇద్దరు మృతి, హృదయ విదారకంగా దృశ్యాలు

తమిళనాడులోని వెల్లింగ్టన్‌ వద్ద సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కూలిన ఘటన దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బిగ్ బాస్

తెలుగు ప్రేక్షకులకు ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తోంది "డిస్నీ ప్లస్ హాట్ స్టార్". టెలివిజన్లో తెలుగు ప్రేక్షకులు కోరుకున్న స్థాయిని మించి ఊహించని వినోదాన్ని అందించిన "బిగ్ బాస్" ఇప్పుడు ఓటీటీలో

హైదరాబాద్‌లో ధమాకా కొత్త షెడ్యూల్.. రవితేజపై యాక్షన్ ఎపిసోడ్స్

మాస్ మహారాజ్ రవితేజ మంచి జోష్‌లో వున్న సంగతి తెలిసిందే. ఆయన చేతుల్లో నాలుగైదు సినిమాలు వున్నాయి.

గౌతంరెడ్డి జ్ఞాపకార్ధం రూ.225 కోట్ల విరాళం.. అలా చేయాలని జగన్‌ని కోరిన మేకపాటి ఫ్యామిలీ

ఇటీవల గుండెపోటుతో మరణించిన ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి జ్ఞాపకార్థం ఆయన పేరుతో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.

పవన్ సినిమాకు ఎదురుచూసినట్లు.. ఎన్టీఆర్ మూవీకి ఏనాడైనా వెయిట్ చేశారా : టీడీపీ నేతలకు పేర్ని నాని సెటైర్లు

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా టికెట్ ధరలు, తదితర  సమస్యలకు సంబంధించి టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి పేర్ని నాని చురకలంటించారు.