ప్ర‌భాస్ 'జాన్' లో బాహుబలి సెంటిమెంట్

  • IndiaGlitz, [Saturday,November 09 2019]

బాహుబ‌లితో నేష‌న‌ల్ రేంజ్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌. త‌ర్వాత విడుద‌లైన సాహోతో ఓకే అనిపించుకున్నాడు. ఇప్పుడు త‌దుప‌రి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. 'జిల్‌' ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ హీరోగా 'జాన్‌'(విన‌ప‌డుతున్న టైటిల్‌) సినిమా తెర‌కెక్కుతుంది. గోపీకృష్ణా మూవీస్‌, యు.వి.క్రియేష‌న్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను కూడా తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. అయితే 'సాహో' విష‌యంలో నిర్మాత‌లు బ‌డ్జెట్ విష‌యంలో చేసిన త‌ప్పులను మ‌ళ్లీ చేయ‌కూడ‌ద‌ని అనుకుంటున్నార‌ట‌. అందుకు భారీ చిత్ర‌మే అయినా జాగ్ర‌త్త‌ల‌తోనే జాన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

1970 బ్యాక్‌డ్రాప్‌లో యూర‌ప్‌లో జ‌రిగే ల‌వ్‌స్టోరీ ఇది. ప్ర‌స్తుతం ఆ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. అందుకోసం స్పెష‌ల్ సెట్స్ కూడా వేస్తున్నార‌ట‌. కాగా లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాకు కూడా 'బాహుబ‌లి' సెంట‌మెంట్‌నే ప్ర‌భాస్ ఫాలో అవుతున్నాడ‌ని టాక్‌. ఇంత‌కు ప్ర‌భాస్ ఏ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడో తెలుసా? త‌ండ్రీ కొడుకులుగా న‌టించ‌డం. బాహుబ‌లిలో తండ్రీ కొడుకులుగా న‌టించిన ప్ర‌భాస్‌.. జాన్ సినిమాలోనూ తండ్రీ కొడుకులుగా న‌టిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది విడుద‌ల చేయ‌బోతున్నారు.

More News

కొత్త రంగంలోకి అడుగుపెడుతున్న ఎన్టీఆర్ ?

హీరోగా వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ స్టార్ హీరోగా కొన‌సాగుతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొత్త ఆలోచ‌న‌లు చేస్తున్నారు.

‘చలో ట్యాంక్‌బండ్’లో కలకలం..  మావోలు రంగంలోకి దిగారా!?

గత కొన్ని రోజులుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్స్‌ను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే.

అయోధ్య నేపథ్యంలో మీడియాకు కేంద్రం మార్గదర్శకాలు

భారతదేశంలో అతిపెద్ద, దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే కీలక అయోధ్య భూవివాదం కేసులో అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం విదితమే.

అయోధ్య తీర్పుపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

అయోధ్య స్థల వివాదంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే.

ఈ నెల 21న 'జాక్‌పాట్' విడుదల

జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా జాక్‌పాట్.