రాసుకుపూసుకు తిరుగుతున్నారుగా.. ఆ డబ్బంతా ఏమైంది: బాలకృష్ణ

  • IndiaGlitz, [Thursday,July 15 2021]

నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మా అసోసియేషన్ ఎన్నికలపై, మా బిల్డింగ్ నిర్మాణంపై బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మా ఎన్నికలో లోకల్, నాన్ లోకల్ అనే అంశాన్ని తాను పట్టించుకోనని బాలయ్య అన్నారు. ఓ ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమ గురించి అనేక విషయాలు మాట్లాడారు.

లోకల్, నాన్ లోకల్ పక్కన పెట్టండి.. నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా.. ఇంతవరకు మా బిల్డింగ్ ఎందుకు కట్టలేదు.. సమాధానం చెప్పండి అని బాలయ్య ప్రశ్నించారు. పనికిరాని గొడవల్లో నేను తలదూర్చను. నాకు చాలా భాద్యతలు ఉన్నాయి అని బాలయ్య అన్నారు. మనది గ్లామర్ ఇండస్ట్రీ. ఏ సమస్య వచ్చిన కూర్చుని చర్చించుకోవాలి. రచ్చ చేయకూడదు అని అన్నారు.

కంట్లో నలుసు పడింది కదా అని కనుగుడ్లు పీకేసుకుంటామా అని బాలయ్య ఇండస్ట్రీలో జరుగుతున్న గొడవలపై ఎద్దేవా చేశారు. అసలు సమస్యపై ఫోకస్ చేయాలి. బిల్డింగ్ ఇంతవరకు ఎందుకు కట్టలేదు.. తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగితే ఒక ఎకరా భూమి ఇవ్వలేదా ? తెలంగాణ ప్రభుత్వంతో రాసుకుపూసుకు తిరుగుతున్నారుగా.. అడిగితే ఇవ్వరా అని బాలయ్య ప్రశ్నించారు.

ఇంతకు ముందు కూడా ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు చేశారు. అమెరికాకు ఫస్ట్ క్లాస్ విమానాల్లో ప్రయాణించారు. ఆ డబ్బంతా ఏమైంది అని బాలయ్య అడిగారు. కానీ నేను ఇలాంటి విషయాలు పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే నాకు నా నియోజకవర్గం, క్యాన్సర్ ఆసుపత్రి, సినిమాలు ఇలా చాలా భాద్యతలు ఉన్నాయి అని బాలయ్య అన్నారు.

తాను సొంతంగా మా బిల్డింగ్ నిర్మిస్తాను అంటున్న మంచు విష్ణుకి బాలయ్య మద్దతు తెలిపారు. అలా చేస్తే నేను కూడా మంచు విష్ణుకి సాయం అందిస్తాను.. ఓ చేయి వేస్తాను అని బాలయ్య అన్నారు. అందరం తలో చెయ్యి వేస్తే ఇంద్రభవనం లాంటి బిల్డింగ్ నిర్మించవచ్చు అని బాలయ్య తెలిపారు.

మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సివిఎల్ నరసింహారావు, జీవిత లాంటి ప్రముఖులు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

More News

వావ్.. పౌరాణిక చిత్రంలో అల్లు అర్జున్ కుమార్తె.. ఎంట్రీ అదిరిందిగా!

అల్లు ఫ్యామిలీ నుంచి క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అల్లు వారి కుటుంబంలో నాలుగోతరం నటులు రెడీ అవుతున్నారు.

4 గంటలపాటు విచారణ..కత్తి మహేష్ స్నేహితుడు చెప్పిన విషయాలేంటి ?

కత్తి మహేష్ రోడ్డు ప్రమాదం, మృతి కేసులో పోలీసులు విచారణని వేగవంతం చేశారు.

గ్రాండ్ లాంచ్ కి రెడీ అవుతున్న ఛత్రపతి రీమేక్.. ఈ విశేషాలు తెలుసా!

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూకి రెడీ అవుతున్నాడు. ఛత్రపతి రీమేక్ లో శ్రీనివాస్ బాలీవుడ్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే.

Roar Of RRR: అంచనాలు తారాస్థాయికి.. మతిపోగొడుతున్న వీడియో!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ పై అంచనాలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరాయి.

పవన్, రానా మూవీ నుంచి సినిమాటోగ్రాఫర్ అవుట్.. ఏమైంది?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్ర షూటింగ్ ఇటీవల హైదరాబాద్ లో తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే.