ఛీ.. ఛీ.. నేను మాట్లాడమేంటి : బాలయ్య

  • IndiaGlitz, [Tuesday,June 02 2020]

టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా సీనియర్ హీరో కమ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించడం.. ఇలా వివాదం ముదిరింది. ఈ మొత్తం వ్యవహారంపై తాజాగా ఓ ప్రముఖ యూ ట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి గారు, నాగార్జున గారు సీఎం కేసీఆర్‌ గారిని వెళ్లి కలిశారు. దీనికి మిమ్మల్ని పిలవలేదు. గొడవలు జరుగుతున్నాయ్ కదా..? దీనికి మీరేమంటారు..!. కేసీఆర్ గారి మీద విమర్శలు చేశారని పిలవలేదా..? అని యాంకర్ ప్రశ్నించగా.. ఇందుకు బాలయ్య చాలా లాజికల్‌గా స్పందించారు.

వాళ్లకే తెలియాలి..!

‘అవునండీ.. కేసీఆర్‌ గారికి నా మీద ఎప్పుడు కోపం లేదు. అది రాజకీయాలు.. రాజకీయాలే. నామా నాగేశ్వరరావును పార్టీలో చేర్చుకోలా..?. కేసీఆర్‌ను ఆయన ఎన్ని తిట్లు తిట్టుంటాడు. రాజకీయాలు వేరు. అందుకే చెబుతున్నా హిప్పోక్రసీ, సైకో ఫ్యాన్సీ. నన్ను వేరుగా చేస్తే మాత్రం తిక్కరేగుతుంది. కేసీఆర్ గారికి నాపైన అలాంటిదేమీ లేదు. నాన్నగారు ఎన్టీఆర్ అభిమానిగా ఆయన.. నేనంటే పుత్ర వాత్సల్యం ఉంది. కేసీఆర్‌కు నా మీద అలాంటి అభిప్రాయం ఏమీ ఉండదు. ఎందుకు పిలవలేదో వాళ్లకే తెలియాలి. దేవుడున్నాడు.. ఒకప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చే మనం ఇప్పుడు ఎదురుపడినప్పుడు నమస్కారం (దండం) పెట్టుకోవాల్సి వస్తోంది. ఎవరైనా సరేనా మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోండి. నేను ఇది నాన్నగారి నుంచి నేర్చుకున్నాను’ అని బాలయ్య చెప్పుకొచ్చారు.

నాగబాబు వ్యాఖ్యలపై..

‘నేనేం మాట్లాడలా.? ఆయనే నాగబాబే మాట్లాడుతున్నాడు. చీ.. ఛీ నేనేం మాట్లాడలేదు. నేను మాట్లాడటమేంటి..?. ఇప్పుడు మాట్లాడటానికి కూడా ఏముంది..?. ఇండస్ట్రీ అంతా ఆల్ మోస్ట్‌ ఇవాళ నాకు సపోర్టుగానే వస్తోంది.. మాట్లాడుతోంది. ఇక నేనెందుకు మాట్లాడాలి’ అని బాలయ్య చెప్పుకొచ్చారు. కాగా భూముల గురించి ఇప్పుడు మాట్లాడాలని ఇంటర్వ్యూలో అడగ్గా.. అబ్బే ఇంకే మాట్లాడతాను అన్నట్లుగా తల అలా అలా ఊపిన బాలయ్య మిన్నకుండిపోయారు. కాగా ఇదే ఇంటర్వ్యూలో మల్టిస్టారర్ మూవీతో పాటు పలు ఆసక్తికర విషయాలను బాలయ్య పంచుకున్నారు.

More News

బాల‌య్య డిమాండ్‌..?

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా రూపొందుతోన్న 106వ చిత్రం చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.

మెగా హీరో క‌థ‌తో శ‌ర్వా సినిమా

యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్ చేతిలో ఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ఏడాది జానుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన శ‌ర్వానంద్‌కు నిరాశ త‌ప్ప‌లేదు.

విదేశీ షెడ్యూల్ వ‌ద్ద‌న్న మ‌హేశ్‌!!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’. మ‌హేశ్ 27వ చిత్రంగా తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రంలో 40 శాతం చిత్రీక‌ర‌ణను

కొత్త ఆలోచ‌న‌లో బ‌న్నీ అండ్ టీమ్

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ పుష్ప. పాన్ ఇండియా మూవీగా సెట్స్ పైకి వెళ్లాలనుకుంటున్న స‌మ‌యంలో క‌రోనా ప్ర‌భావంతో లాక్‌డౌన్ విధించారు.

'ల‌వ్,లైఫ్ అండ్ ప‌కోడి' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

క‌ల‌ర్ ఆఫ్ మై  ఇంక్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై మ‌ధురా శ్రీధ‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌ణ లో రూపొందిన చిత్రం "ల‌వ్ లైఫ్ అండ్ ప‌కోడి" జ‌యంత్ గాలి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో