బంతిపూల జాన‌కి సెన్సార్ పూర్తి

  • IndiaGlitz, [Wednesday,July 13 2016]

ఉజ్వల క్రియేషన్స్ పతాకం పై.. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో కల్యాణి-రాం నిర్మాతలుగా రూపొందిన చిత్రం “బంతిపూల జానకి”. ధనరాజ్, దీక్షాపంత్ మరియు "జబర్దస్త్" టీమ్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని "యూ/ఎ" సర్టిఫికేట్ అందుకొంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు, సినిమా చాలా బావుంది అని ప్రశంసించదాంతోపాటు ఈమధ్య కాలంలో ఇలాంటి కామెడీ ఎంటర్ టైనర్ చూడలేదని, చాల చక్కగా సినిమాని తీర్చిదిద్దారని అన్నారు.

ఇటీవల విడుదలైన థియేటర్ ట్రైలర్ కి అనూహ్య స్పందన లభిస్తోంది. త్వరలో ఆడియో ఫంక్షన్ నిర్వహించి, విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.

ధనరాజ్, దీక్షాపంత్ హీరో, హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రంలో.. అదుర్స్ రఘు, చమ్మక్ చంద్ర, షకలక శంకర్, వేణు, రాకెట్ రాఘవ, డా. భరత్ రెడ్డి, సుడిగాలి సుధీర్, జీవన్, అవినాష్, ఫణి, నాగి, కోమలి తదితరులు నటించారు.

ఈ చిత్రానికి కెమెరా: జి.ఎల్. బాబు, సంగీతం: భోలే, ఎడిటింగ్: డా.శివ వై. ప్రసాద్, పాటలు : కాసర్ల శ్యాం, కథ – మాటలు : శేఖర్ విఖ్యాత్, ఫైట్స్ : సూపర్ ఆనంద్, ఆర్ట్ డైరెక్టర్ : విజయ్ కృష్ణ, పబ్లిసిటీ డిజినేర్ : వివ, కో-డైరెక్టర్ : బోయనపల్లి రమణ. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : తేజ, నిర్మాతలు : కల్యాణి –రాం. స్క్రీన్ ప్లే–దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్!

More News

కె.సి.ఆర్ కి అదిరిపోయే కితాబిచ్చిన కృష్ణ‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.సి.ఆర్ పిలుపు మేర‌కు హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా సినీ ప్ర‌ముఖులు మొక్క‌లు నాటిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా సూప‌ర్ స్టార్ కృష్ణ, విజ‌య‌నిర్మ‌ల‌, న‌రేష్ ల‌తో క‌లిసి నాన‌క్ రామ్ గూడ‌లోని ప్ర‌భుత్వ ప్రాథిమికోన్న‌త పాఠ‌శాల‌లో మొక్క‌లు నాటారు.

ఎం.జి.ఎం మూవీస్ ద్వారా 15న పున్న‌మిరాత్రి విడుద‌ల

శ్రద్ధాదాస్, మోనాల్ గుజ్జర్ (సుడిగాడు ఫేమ్) ఆర్యన్, శ్వేతాబసుప్రసాద్, నాజర్, ప్రభు, కృష్ణ భగవాన్ ముఖ్య తారాగణంగా రూపొందిన గ్లామరస్ హారర్ ఎంటర్ టైనర్ "పున్నమి రాత్రి".

మెగాస్టార్ మూవీలో న‌టిస్తున్న‌ లేడీ అమితాబ్..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు.

కొర‌టాల హీరో హీరోయిన్ కాళ్లు ప‌ట్టుకోవాల్సిందేనా...

ప్ర‌భాస్ తో మిర్చి, మ‌హేష్ తో శ్రీమంతుడు చిత్రాల‌ను తెర‌కెక్కించి బ్లాక్ బ‌ష్ట‌ర్స్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో కొర‌టాల శివ జ‌న‌తా గ్యారేజ్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

రానా 'చ‌రిత్ర‌'

రానా ద‌గ్గుబాటి హీరోగా నువ్వు నేను, జ‌యం వంటి విల‌క్ష‌ణ ప్రేమ‌క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ కొత్త చిత్రం రూపొంద‌నుంద‌నే విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.