close
Choose your channels

టీడీపీకి భారీ షాక్.. జనసేనలోకి ఊహించని కీలకనేత

Thursday, March 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీడీపీకి భారీ షాక్.. జనసేనలోకి ఊహించని కీలకనేత

నంద్యాల ఎంపీ, టీడీపీ కీలకనేత ఎస్‌పి‌వై రెడ్డి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్‌తో భేటీ అయిన కీలక చర్చల అనంతరం కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన పదినిమిషాలకే నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా రెడ్డి పేరుని ఖరారు చేయడం జరిగింది. అనంతరం ఆయనకు బి-ఫారం అందచేశారు. ఈ సందర్భంగా తనకు అభ్యర్థిత్వం ఖరారు చేసినందుకు పవన్‌కు.. ఎస్పీవై రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

అధికార పార్టీకి భారీ షాక్..

కాగా.. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన ఈయన.. టీడీపీలోకి జంప్ అయిన నేతల్లో మొదటి వ్యక్తి. అయితే ఈయన ఇన్ని రోజులుగా టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ నంద్యాల పార్లమెంట్ టికెట్ కేటాయించడానికి ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు సాహసించలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన అయిన ఏ పార్టీలోకి వెళ్లాలా అని తన అనుచరులు, కుటుంబీకులు, ముఖ్య కార్తలతో నిశితంగా చర్చించి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. కాగా.. అటు టీడీపీలోనూ.. ఇటు వైసీపీలోనూ టికెట్లు ఇచ్చే పరిస్థితుల్లేవ్. దీంతో ఈయన టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. రెడ్డి.. టీడీపీనికి వీడటం భారీ షాక్ కాగా.. ఇలా జనసేనలో తీర్థం పుచ్చుకుంటారని బహుశా ఎవరూ ఊహించి వుండకపోవచ్చేమో. అయితే జనసేన తరఫున ఏ మాత్రం గెలుస్తారో తెలియాలంటే ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.