డిజిట‌ల్ రంగంపై క‌న్నేసిన అగ్ర నిర్మాణ సంస్థ‌

  • IndiaGlitz, [Friday,June 26 2020]

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లోని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల్లో యువీ క్రియేష‌న్స్ ఒక‌టి. వంశీ, ప్ర‌మోద్‌, విక్ర‌మ్‌లు ఈ బ్యాన‌ర్‌పై సినిమాల‌ను రూపొందించే సంగ‌తి తెలిసిందే. మిర్చి, ర‌న్‌రాజార‌న్‌, మ‌హానుభావుడు, భ‌లేభ‌లే మ‌గాడివోయ్‌, భాగ‌మ‌తి, సాహో వంటి విజ‌యంత‌మైన‌ సినిమాల నిర్మాణం యువీ క్రియేష‌న్స్ నుండి వ‌చ్చిన‌వే. ఇప్పుడు మ‌రికొన్ని సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. కాగా ఇప్పుడు ట్రెండ్‌కు అనుగుణంగా డిజిట‌ల్ కంటెంట్‌ను అందించాల‌ని యువీ క్రియేషన్స్ ప్లాన్స్ చేస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

స‌మాచారం మేర‌కు అగ్ర ద‌ర్శ‌కులైన పూరీ జ‌గ‌న్నాథ్‌, శ‌ర్వానంద్‌తో ర‌న్‌రాజార‌న్‌, ప్ర‌భాస్‌తోసాహో వంటి సినిమాలు చేసిన సుజిత్‌ను యువీ సంస్థ క‌లిసి త‌మకు డిజిట‌ల్ కంటెంట్‌ను అందించాల‌ని కోరింద‌ట‌. అయితే ప్ర‌స్తుతం పూరి వ‌రుస సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. సుజిత్ త‌దుప‌రి మెగాస్టార్ లూసిఫ‌ర్ సినిమాను రీమేక్ చేయాల్సి ఉంది. ఈ త‌రుణంలో వీరు డిజిట‌ల్ కంటెంట్‌ను ఎలా అందిస్తార‌నేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. అయితే ఈ విష‌య‌మై క్లారిటీ రావాలంటే మ‌రికొంత‌కాలం ఆగాల్సిందే. ఇప్పుడు టాలీవుడ్‌కి చెందిన చాలా మంది నిర్మాతలు డిజిటల్ కంటెంట్‌ను జనరేట్ చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.

More News

ఓ స్టార్ హీరోతో ‘షాడో’ను రూపొందించనున్నాం: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్

మధుబాబు రచించిన తెలుగు నవల ‘షాడో’ ఇప్పుడు దృశ్యరూపంగావించబడుతోంది. అతి పెద్ద నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్స్

రాజేష్‌ టచ్‌రివర్‌ దర్శకత్వంలో 'సైనైడ్‌'

జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న రాజేష్‌ టచ్‌రివర్‌ ప్రకటించిన కొత్త సినిమా 'సైనైడ్'.

రచ్చకెక్కిన దాస‌రి త‌న‌యుల ఆస్థి గొడ‌వ‌

సీనియ‌ర్ దివంగ‌త ద‌ర్శ‌కుడు డా.దాస‌రి నారాయ‌ణ‌రావు త‌న‌యుల మ‌ధ్య ఆస్థి గొడ‌వ‌లు రేగాయి. దాస‌రి పెద్ద కొడుకు ప్ర‌భు, చిన్న కొడుకు అరుణ్ కుమార్‌పై జూబ్లీహిల్స్‌

హుద్రోగులు, హై బీపీ ఉన్న వారికి షాకింగ్ న్యూస్..

కరోనా నుంచి కోలుకున్న బాధితుడికి తిరిగి వచ్చే అవకాశం ఉందా? అంటే.. అలా అని ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలూ లేవని వైద్యులు చెబుతున్నారు.

చైనాపై పోరులో భారత్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధమైన అమెరికా!

చైనాపై పోరుకు సిద్ధమవుతున్న భారత్‌కు మద్దతు ఇస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది.