close
Choose your channels

ఓ స్టార్ హీరోతో ‘షాడో’ను రూపొందించనున్నాం: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్

Friday, June 26, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మధుబాబు రచించిన తెలుగు నవల ‘షాడో’ ఇప్పుడు దృశ్యరూపంగావించబడుతోంది. అతి పెద్ద నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్స్ దీనికి దృశ్యరూపం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. వెబ్ సిరీస్ రూపంలో నవలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ విషయాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తమ అధికారిక ట్విటర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. స్టార్ హీరోల్లో ఒకరిని దీనికి హీరోగా తీసుకోవాలని భావిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది.

‘‘ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫొరాను తీసుకురావడం మాకు సంతోషంగా ఉంది. ‘షాడో’ నవలను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాం. ఈ వెబ్ సిరీస్‌కు ఓ స్టార్ హీరోను తీసుకోవాలని భావిస్తున్నాం. ‘షాడో’ నవలా రచయిత మధుబాబుకు ధన్యవాదాలు. ఆయన అంగీకారంతోనే మేము నవలను తెరకెక్కించనున్నాం. షాడో సిరీస్ మొత్తం నాణ్యతలో అంతర్జాతీయ రచనలకు పోటీ పడుతోంది’’ అని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ పేర్కొంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.