close
Choose your channels

బిగ్ సర్ ప్రైజ్: ధనుష్, శేఖర్ కమ్ముల పాన్ ఇండియా మూవీ!

Thursday, June 17, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్ సర్ ప్రైజ్: ధనుష్, శేఖర్ కమ్ముల పాన్ ఇండియా మూవీ!

దక్షణాది సినీ అభిమానులకు ఇది బిగ్ సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు. వైవిధ్య భరితమైన కథలని ఎంచుకుంటూ.. తన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి నటిస్తున్న నటుడు ధనుష్. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడమే కాదు.. తన చిత్రాల గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకునేలా చేస్తున్నాడు ఈ హీరో.

ఇదీ చదవండి: హీరోయిన్ న్యూడ్ పిక్ వైరల్.. అందాలకు అదొక్కటే అడ్డు!

ఇటీవల ధనుష్ నటించిన అసురన్, కర్ణన్ చిత్రాలే ఇందుకు నిదర్శనం. ఈ చిత్రాల్లో ధనుష్ నటన వర్ణనాతీతం అంతే. ఇక సెన్సిబుల్ చిత్రాలతో సూపర్ కూల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. అలాంటిది వీరిద్దరి కాంబోలో పాన్ ఇండియా చిత్రానికి రంగం సిద్ధం అయింది.

ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ ని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన శుక్రవారం జూన్ 18న ఉదయం 9 గంటలకు వెలువడనుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఇదే బ్యానర్ లో చైతు, సాయి పల్లవి లతో కమ్ముల లవ్ స్టోరీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఆసక్తికర ఈ ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని వివరాలు శుక్రవారం తెలియనున్నాయి. ధనుష్ నటించిన జగమే తందిరం త్వరలో ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.