బిగ్‌బాస్ 5లో ‘‘ ఆకలి రాజ్యం ’’... కెప్టెన్సీ కోసం కడుపు మాడ్చుకున్న కంటెస్టెంట్స్ , రేసులో ఆ ముగ్గురు

  • IndiaGlitz, [Thursday,September 30 2021]

కెప్టెన్సీ కోసం బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌ను గెలిచేందుకు కంటెస్టెంట్స్ కుస్తీ పెట్టారు. దీని వల్ల ఇంటి సభ్యులకు ఫుడ్ విలువ తెలిసొచ్చింది. అంతటి ఆకలిని తట్టుకుని మరి గేమ్ ఆడిన కంటెస్టెంట్లు స్పూర్తిని నింపారు. మరి ఈ టాస్క్‌లో ఎవరు విజయం సాధించి కెప్టెన్సీ చేజిక్కించుకున్నారో ఒకసారి చూస్తే..

'గెలవాంటే తగ్గాల్సిందే' అనే ఈ టాస్క్ లో ఇంటి సభ్యులు తమ బరువుని తగ్గించుకోవాల్సి ఉంటుంది. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో శ్రీరామచంద్ర-హామీద గెలిచారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో సన్నీ-మానస్ అసలు ఏమాత్రం తగ్గకుండా వర్కవుట్ చేస్తూనే ఉన్నారు. కానీ మధ్యలో ఆకలేస్తుందని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఎంటర్‌టైన్ చేశారు. గార్డెన్ ఏరియాలో వాకింగ్ చేస్తూ.. ఎవరైనా ఉంటే ఓ బిరియాని ప్యాకెట్ పడేయండి అంటూ కేకలు వేశాడు సన్నీ. లోబోని ఆకలిని కంట్రోల్ చేసుకోమని.. అదే టాస్క్ అంటూ చెప్పారు నటరాజ్.

'ఏడు సముద్రాలు దాటాక.. ఇంటిముందున్న మురికిగుంటలో కాలెట్టేశారు' అంటూ లోబోతో ఓ సామెత చెప్పారు మాస్టర్. ఆ తరువాత ఫుడ్ బండి ద్వారా.. పావ్ బాజీ పంపించారు బిగ్ బాస్. కానీ హౌస్ మేట్స్ ఎవరూ టెంప్ట్ అవ్వకుండా దానిని తిరిగి పంపించేశారు. ప్రతి సెకన్ నాకు అన్నం విలువ అర్ధమవుతుందని యాంకర్ రవి ఎమోషనల్ గా అన్నాడు. ఇదే సమయంలో ఆకలి విలువ తెలిసేలా యాంకర్ రవి, నటరాజ్, విశ్వ, లోబో, ప్రియా కలిసి ఓ స్కిట్ వేశారు. 'ఆకలిరాజ్యం' సినిమాలో సీన్ ను స్కిట్ గా పెర్ఫార్మ్ చేశారు. ఈ స్కిట్ లో ప్రతి ఒక్కరూ జీవించేశారు.

టాస్క్ సందర్భంగా బిగ్ బాస్ పెట్టిన రూల్ ప్రకారం.. 'ఫుడ్ బండి' వచ్చిన తర్వాతే ఇంటి సభ్యుల్లో ఒకరు ఆహారం తీసుకోవాలి. అయితే, లోబో ఆకలికి తట్టుకోలేక తాను దాచుకున్న ఆహారాన్ని తిన్నాడు. దీనిపై బిగ్ బాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాగే నిబంధనలు తప్పినందుకు కెప్టెన్ జెస్సీతోపాటు అతడికి పార్టనర్‌గా ఉన్న కాజల్‌ను కెప్టెన్సీ పోటీదారుల నుంచి తప్పించారు. దీంతో జెస్సీ అసహనం వ్యక్తం చేశాడు. తాను వారిస్తున్నా.. నీకు మానవత్వం లేదా అన్నారని, ఇప్పుడు చూడండి అంటూ హౌస్ మేట్స్ పై సీరియస్ అయ్యాడు. 'నన్ను టాస్క్ కోసం సెలెక్ట్ చేసుకున్నావ్ అక్కా నాకు చాలా గిల్టీగా ఉంది' అంటూ కాజల్ కి సారీ చెప్పాడు.

ఆ తరువాత బెడ్ రూమ్ లో కాజల్ తో డిస్కస్ చేస్తూ.. 'హౌస్ మేట్స్ అంతా టార్గెట్ చేసి చేసినట్లు అనిపిస్తుంది నాకు.. నాగ్ సార్ ముందు వీక్ అనిపించేలా చేస్తున్నారు' అంటూ కామెంట్స్ చేశాడు జెస్సీ. ''నేను ఈ హౌస్ కి ఫిట్ కాను.. ఒక్కరు కూడా నా మాట వినలేదు..'' అంటూ షణ్ముఖ్ దగ్గర వాపోయాడు జెస్సీ. దానికి షణ్ముఖ్ 'అరవడం వేరు కమాండింగ్ వేరు.. నీలో అరవడమే చూశా.. కానీ నీదే తప్పు అని చెప్పట్లేదు.. వాళ్లు నిన్ను గ్రాంటెడ్ గా తీసుకున్నారు'' అంటూ హౌస్ మేట్స్ ని ఉద్దేశిస్తూ చెప్పాడు షణ్ముఖ్. ''ఇక్కడ అందరూ ఒకటే. ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. అందర్నీ పేరు పెట్టి పిలువు. అన్న అని అనాల్సిన అవసరం లేదు'' అని జెస్సీకి సలహా ఇచ్చాడు షణ్ముఖ్‌.

తర్వాత పిడుగుల శబ్ధం వినబడగానే విశ్వ మొదటగా వెళ్లి బజర్‌ నొక్కాడు. గేమ్ లో పవర్ రూమ్ యాక్సెస్ రవి-విశ్వలకు రాగా.. పవర్ రూమ్ లోకి వెళ్లిన వీరిద్దరూ తమతో గేమ్ ఆడదానికి ప్రియా-ప్రియాంకలను ఎన్నుకున్నారు. ఇది ఫిజికల్ టాస్క్ అయినప్పటికీ ప్రియా-ప్రియాంక టఫ్ కాంపిటిషన్ ఇచ్చారు. చివరికి రవి-విశ్వాలే గెలిచారు. ఇక షణ్ముఖ్‌ మరోసారి.. టాస్కులో నీ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్‌ అవుతున్నానని రవితో చెప్పుకొచ్చాడు. అసలు నీవల్ల జెస్సీ ఇన్‌ఫ్లూయెన్స్‌ అవుతున్నాడని రవి రివర్స్‌ కౌంటరివ్వగా వాడే నాకు చెప్తూ ఉంటాడని కవరింగ్‌ ఇచ్చాడు షణ్ను. నీతో మాట్లాడటమే లేదు, అయినా ఇంకా ఇన్‌ఫ్లూయెన్స్‌ అవుతున్నా అనడమేంటో అర్థం కావడం లేదని అయోమయానికి లోనయ్యాడు. దీన్ని తెగేదాకా లాగడం అనవసరమని భావించి అక్కడితో ఆ విషయానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాడు రవి.

ఇంతలో బిగ్‌బాస్‌ బర్గర్‌ అండ్‌ ఫ్రైడ్‌ చికెన్‌ పంపించగా దాన్ని తింటానంటూ జెస్సీ ముందుకు వచ్చాడు. కానీ ఈలోగా పింకీ వచ్చి ఆ ప్లేటు తీసుకుపోయింది. లోబో ఆకలితో బాధపడుతున్నాడని అర్థం చేసుకున్న రవి.. నటరాజ్‌ మాస్టర్‌ దగ్గరకు వెళ్లి ఎందుకైనా మంచిది, నీ జోడీని ఓ కంట కనిపెడుతూ ఉండమని హెచ్చరించాడు. అలా హెచ్చరించాడో లేదో, అటు లోబో ఆకలిని తట్టుకోలేక చెత్త కవర్‌లో ఫుడ్‌ కోసం వెతికాడు. అతడి బాధ అర్థమైన మాస్టర్‌.. నీకు ఆకలైతే తినేసేయ్‌ అని సూచించాడు. అది చూసిన రవి, ప్రియాంక వెంటనే అతడి దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లారు. ఇంటి సభ్యులు అటుగా వస్తున్నారని తెలిసి.. ముఖం కడుకున్నట్లు నటించాడు లోబో. ఆ తరువాత సన్నీ-మానస్ లకు పవర్ రూమ్ యాక్సెస్ దొరకగా.. వారు తమతో గేమ్ ఆడడానికి నటరాజ్-లోబోలను ఎన్నుకున్నారు. తనను సెలెక్ట్ చేసుకోలేదని సిరి ఫీలైపోయింది. వీరికి బిగ్‌బాస్‌ మునుగుతారా? తేలుతారా? అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో కొన్ని వస్తువులు నీళ్లలో మునుగుతాయా? లేదా? అన్నది కరెక్ట్‌గా గెస్‌ చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో సన్నీ-మానస్ లు గెలిచారు.

తర్వాత బిగ్ బాస్... ఇంటి సభ్యులందరికీ బిరియాని పంపించారు. ఎవరికి కావాలంటే వారు తినొచ్చని చెప్పడంతో హౌస్ మేట్స్ అందరూ ఎగిరి గంతులేశారు. అంతా శుభ్రంగా మటన్ బిరియానిపి పీకలదాకా తొక్కేశారు . కానీ సన్నీను మాత్రం మానస్ తిననివ్వలేదు. ఆ తరువాత హమీద వచ్చి సన్నీను ఫుడ్ తినమంటూ బలవంతం చేసింది. షణ్ముఖ్-సిరి కూడా టాస్క్ కోసం ఫుడ్ తినలేదు. పాపం.. షణ్ముఖ్ మటన్ బిరియాని తినలేకపోతున్నానని తెగ ఫీలైపోయాడు. మరి వీరిలో కెప్టెన్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.

More News

చిత్రసీమలో మళ్లీ డ్రగ్స్ కలకలం... మాదక ద్రవ్యాలతో పట్టుబడ్డ 'సింగం' నటుడు

డ్రగ్స్.. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, శాండిల్‌వుడ్ చిత్ర పరిశ్రమలను ఎంతగా కుదిపేస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల తెలుగు చిత్రసీమలో డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణ పూర్తి చేసింది ఈడీ.

కుక్క మొరిగింది... పట్టించుకోవచ్చు: ‘‘ బాలయ్య ’’ ఫోటోతో పోసానికి నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్

అటు ఏపీ మంత్రులు, వైసీపీ నేతు, పోసాని కృష్ణ మురళి తన సోదరుడు పవన్‌ కల్యాణ్‌పై చేస్తున్న విమర్శలకు మెగా బ్రదర్ నాగబాబు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

పవన్‌‌‌ను తిడతారా.. 2024లో అనుభవిస్తారు: జగన్‌కు కాపు సంక్షేమ సేన హెచ్చరిక

‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఊపేస్తున్నాయి.

‘పుష్ప: ది రైజ్’ నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్

అల వైకుఠ‌పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో

'పుష్పక విమానం' నవంబర్ 12న విడుదల

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం "పుష్పక విమానం" రిలీజ్ కు రెడీ అవుతోంది.