'సాహో'కి బై బై చెప్పిన బాలీవుడ్ న‌టుడు

  • IndiaGlitz, [Monday,June 17 2019]

'బాహుబ‌లి' ప్ర‌భాస్ తాజా చిత్రం 'సాహో'. సుజీత్ ద‌ర్శ‌కుడు. శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌. యు.వి.క్రియేష‌న్స్ నిర్మిస్తోన్న ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది. సినిమా షూటింగ్ ముగింపు దశ‌కు చేరుకుంటుంది. సినిమాలో ప‌నిచేసిన స్టార్ కాస్ట్ అంతా బై బై చెప్పేస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలో విల‌న్‌గా న‌టించిన బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ త‌న పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసేసుకున్నాడు. ''ఈ ప్ర‌యాణం మొద‌లు పెట్టి రెండేళ్లు అవుతుంది. ఈ టీంతో ప‌నిచేయ‌డం గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్‌'' అంటూ సోష‌ల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడీ న‌టుడు.

రీసెంట్‌గా విడుద‌లైన ఈ టీజ‌ర్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. ఈ సినిమాకు జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నార‌ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది.

More News

'గుణ 369' టీజ‌ర్‌కు అద్భుత స్పంద‌న‌..!

'మ‌న `ఆర్‌.ఎక్స్.100` ఫేమ్ కార్తికేయ‌ను ఇక‌పై అంద‌రూ `గుణ 369` హీరో కార్తికేయ అని అన‌డం ఖాయం...

మీ స్పందనకు ధన్యవాదాలు ‘సూర్య’ మిత్రమా!

తమిళ స్టారో హీరో సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సూరారై పొట్రు’ చిత్రం. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్, దిగ్గజ నటుడు మంచు మోహన్‌ బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

'ఫస్ట్ ర్యాంక్ రాజు' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..!!

చేత‌న్ మ‌ద్దినేని, క‌శిష్ ఓరా జంట‌గా  న‌రేష్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో డాల్ఫిన్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకం పై మంజునాధ్ వి.కందుకూర్ నిర్మిస్తున్న చిత్రం "ఫ‌స్ట్ ర్యాంక్ రాజు"..

స్క్రిప్టు.. మాట‌.. అన్నీ తానైన క్రిష్‌

క్రిష్ కి ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా మాంచి జోరైన స‌క్సెస్ కావాలి. అది ఏ రూపంలో అయినా ఓకే. అందుకే ఆయ‌న ఓ వెబ్‌సీరీస్‌ను స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించాల‌ని అనుకుంటున్న‌ట్టు వినికిడి.

గుర్తుచేసుకున్న అదితి

మ‌నం ఎక్క‌డి నుంచి వ‌చ్చామో గుర్తుపెట్టుకోవ‌డం చాలా గొప్ప విష‌యం. కానీ ఆ విష‌యాన్ని ఎంత మంది గుర్తుపెట్టుకుంటార‌నేది వేరే విష‌యం.