'సాహో'కి బై బై చెప్పిన బాలీవుడ్ నటుడు
- IndiaGlitz, [Monday,June 17 2019]
'బాహుబలి' ప్రభాస్ తాజా చిత్రం 'సాహో'. సుజీత్ దర్శకుడు. శ్రద్ధాకపూర్ హీరోయిన్. యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆగస్ట్ 15న విడుదల కానుంది. సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంటుంది. సినిమాలో పనిచేసిన స్టార్ కాస్ట్ అంతా బై బై చెప్పేస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలో విలన్గా నటించిన బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ తన పార్ట్ చిత్రీకరణను పూర్తి చేసేసుకున్నాడు. ''ఈ ప్రయాణం మొదలు పెట్టి రెండేళ్లు అవుతుంది. ఈ టీంతో పనిచేయడం గర్వంగా ఫీలవుతున్నాను. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్'' అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడీ నటుడు.
రీసెంట్గా విడుదలైన ఈ టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. ఈ సినిమాకు జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.