close
Choose your channels

'సాహో'కి బై బై చెప్పిన బాలీవుడ్ న‌టుడు

Monday, June 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సాహోకి బై బై చెప్పిన బాలీవుడ్ న‌టుడు

`బాహుబ‌లి` ప్ర‌భాస్ తాజా చిత్రం `సాహో`. సుజీత్ ద‌ర్శ‌కుడు. శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌. యు.వి.క్రియేష‌న్స్ నిర్మిస్తోన్న ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది. సినిమా షూటింగ్ ముగింపు దశ‌కు చేరుకుంటుంది. సినిమాలో ప‌నిచేసిన స్టార్ కాస్ట్ అంతా బై బై చెప్పేస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలో విల‌న్‌గా న‌టించిన బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ త‌న పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసేసుకున్నాడు. ``ఈ ప్ర‌యాణం మొద‌లు పెట్టి రెండేళ్లు అవుతుంది. ఈ టీంతో ప‌నిచేయ‌డం గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్‌`` అంటూ సోష‌ల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడీ న‌టుడు.

రీసెంట్‌గా విడుద‌లైన ఈ టీజ‌ర్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. ఈ సినిమాకు జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నార‌ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.