బాహుబలి మనసుకి బాలీవుడ్ భామ ఫిదా!!

  • IndiaGlitz, [Monday,August 12 2019]

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటీనటులగా సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం ‘సాహో’. ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో భాగంగా శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను, ప్రభాస్ సీక్రెట్స్‌ను బయటపెట్టింది.

కంట్రోల్‌ చేసుకున్నా!

‘సాహో’ సినిమాతో నేను టాలీవుడ్‌కు పరిచయం కావడం ఎంతో ఆనందంగా ఉంది. టాలీవుడ్ నాకు కొత్త పరిశ్రమ అని ఎప్పుడూ అనిపించలేదు. ఈ రెండేళ్ల ప్రయాణంలో గుర్తుండిపోయే జ్ఞాపకాలెన్నో. ఇంత కంటే బెస్ట్ డెబ్యూ లేదని అనుకుంటున్నాను. కథ వినగానే చాలా థ్రిల్ అయ్యాను. ప్రభాస్ హీరో అనగానే నా హ్యాపీనెస్ మూడు రెట్లు పెరిగింది. నా పాత్ర చాలా బావుంటుంది. ప్రభాస్‌తో లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ సీన్స్‌లో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. ఇండియన్‌ బిగ్గెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ట్రైలర్‌ చూశాక ఎగిరి గంతులు వేయకుండా, చప్పట్లు కొట్టకుండా నన్ను నేను కంట్రోల్‌ చేసుకున్నాను. తొలిసారి గన్‌ పట్టాను. పోలీసు పాత్ర చేశాను కాబట్టి, ఆ పాత్రపైన ఉన్న గౌరవం, ఈ సినిమా ప్రయాణంలో ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో యాక్షన్‌ ఘట్టాలు చేయడం అలవాటైంది అన్నారు.

డార్లింగ్‌ను ఆకాశానికెత్తేసింది!

ప్రభాస్ సూపర్‌స్టార్ మాత్రమే కాదు. ఆయన మనసు వెన్న. యూనిట్ మొత్తం ప్రభాస్ మంచి మనసుకి ఫిదా అయిపోయింది. చిత్రబృందం చూపించే ప్రేమాభిమానాల వల్ల ప్రతి రోజూ సెట్స్‌కి వెళ్లాలని అనిపించేది అని ప్రభాస్‌ను ఈ ముద్దగుమ్మ రెబల్‌స్టార్‌ను ఆకాశానికెత్తేసింది. టాలీవుడ్‌లో శ్రద్దా నటించిన ఫస్ట్ మూవీ ‘సాహో’తో ఈ బాలీవుడ్ భామ ఏ మాత్రం మెప్పిస్తుందో తెలియాలంటే ఆగస్టు 30వరకు వేచి చూడాల్సిందే మరి.

More News

స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటున్న ఉపేంద్ర

సినీ హీరో, రాజకీయ నాయకుడు ఉపేంద్ర బెంగళూరులో ఉద్యమానికి తెర తీశాడు. కన్నడిగులకే ప్రభుత్వం ఉద్యోగాలను కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఫ్యాన్స్ వల్ల క్షమాపణలు చెప్పిన మమ్ముట్టి

మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి తన ఫ్యాన్స్ చేసిన పనికి సారీ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకెళ్తే..

బిగ్‌బాస్ నుండి తమన్నా ఔట్

నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 3 మూడోవారం ఎలిమినేషన్ ముగిసింది.

ట్విట్టర్‌ని వదిలేసిన బాలీవుడ్ దర్శకుడు .. కారణమేంటో తెలుసా?

సామాజిక సమస్యలపై సినిమాలు తీసే బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్.. ట్విట్టర్ మాధ్యమం నుండి బయటకు వచ్చేశారు.

కె.విశ్వనాథ్‌ని కలిసి సీఎం కె.సి.ఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్.. సీనియర్ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను కలుస్తున్నారు` అనే వార్త బయటకు రాగానే కె.విశ్వనాథ్‌కి ఏమైంది?