బ‌న్నీకి నేను పెద్ద ఫ్యాన్ అంటున్న బాలీవుడ్ హీరోయిన్‌..

  • IndiaGlitz, [Friday,February 05 2021]

తొలి చిత్రం ఏకంగా స‌ల్మాన్‌ఖాన్‌తో న‌టించి అంద‌రినీ ఆక‌ట్టుకున్న బ్యూటీ స‌యీ మంజ్రేక‌ర్‌. ద‌బాంగ్‌3లో న‌టించిన ఈ అమ్మ‌డు ఇప్పుడు తెలుగులో రెండు సినిమాల్లో న‌టిస్తుంది. అందులో ఒక‌టి అడివిశేష్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న మేజ‌ర్ కాగా.. మ‌రో సినిమా వ‌రుణ్ తేజ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న గ‌ని. ఈ అమ్మ‌డు త‌న సినిమాల గురించి మాట్లాడుతూ ‘‘ప్రతి శుక్రవారం అమ్మతో కలిసి తాజ్ హోటల్‌కి వెళ్లేదాన్ని. ఆ తాజ్ హోట‌ల్‌పై ఉగ్ర‌వాదులు దాడి చేసిన‌ప్పుడు ఎంతో బాధ‌ప‌డ్డాను. ఇప్పుడు ఆ దాడికి సంబంధించి చేసిన ఆప‌రేష‌న్ మూవీ మేజ‌ర్‌లో న‌టించ‌డం యాదృచ్చిక‌మే. తెలుగులో మంచి సినిమాల‌తో ప‌రిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది.

తెలుగు హీరోల్లో నాకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. ఆయ‌న న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో సినిమా చూశాను. తెలుగులో హీరోయిన్‌గా అవకాశం రాగానే నేను చూసిన తొలి తెలుగు సినిమా అదే. అందులో ఆయ‌న న‌ట‌న‌, డాన్స్ చూసి ఫిదా అయిపోయాను. ఆయ‌న‌తో త్వ‌ర‌లోనే న‌టించే అవ‌కాశం వ‌స్తుంద‌ని భావిస్తున్నాను. కథ నచ్చితే భాష గురించి ఆలోచించకుండా నటిస్తాను. ఈ విషయాన్ని నాన్న నాకు చెప్పారు. ’’ అన్నారు.

More News

రెడ్ లైట్ ఏరియాకు వెళ్లిన హీరోయిన్‌...!

ముంబైలో రెడ్‌లైట్ ఏరియా గురించి పెద్దగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అక్క‌డ కామాటిపుర ఏరియా వ్య‌భిచారానికి కేరాఫ్ అడ్ర‌స్‌.

అంగారకుడిపైకి వెళ్లడం ఇప్పుడిక మరింత సులువు..

అంగారకుడిపైకి వెళ్లడం ఇక మీదట మరింత సులువుతో పాటు మరొక విశేషం కూడా ఉంది.

ఆదిలాబాద్‌లో రెచ్చిపోయిన దొంగలు.. ఏకంగా ఏటీఎం మిషన్‌నే లేపేశారు

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఓ ఏటీఎం మిషన్‌నే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కలెక్టర్‌ చౌక్‌లో చోటుచేసుకుంది.

‘లూసిఫర్’ రీమేక్‌లో మార్పులు ఇవేనట..

మోహ‌న్ లాల్ న‌టించిన మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్టర్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌‌లో మెగాస్టార్ చిరంజీవి  నటించనున్న విషయం తెలిసిందే.

ఏపీని కుదిపేస్తున్న.. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కానుందనే వార్త

విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కానుందనే వార్త ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేస్తోంది.