close
Choose your channels

ఆదిలాబాద్‌లో రెచ్చిపోయిన దొంగలు.. ఏకంగా ఏటీఎం మిషన్‌నే లేపేశారు

Friday, February 5, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఓ ఏటీఎం మిషన్‌నే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కలెక్టర్‌ చౌక్‌లో చోటుచేసుకుంది. సినీ ఫక్కీలో ఏటీఎం మిషన్ అపహరణకు గురవడం సంచలనంగా మారింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగిన ఈ దొంగతనం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దొంగలు ఎస్‌బీఐ ఏటీఎం మిషన్‌ను తాళ్లతో కట్టటి లాక్కెళ్లారు. ఈ ఘటన ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే చోటు చేసుకోవడం గమనార్హం.

కాగా.. ఎస్‌బీఐ ఏటీఎం మిషన్‌లో దాదాపు 30 లక్షలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అలాగే దేవిచంద్‌ చౌక్‌లోని మరో ఏటీఎం, జ్యువెలరీ షాపులో చోరీకి సైతం దొంగలు యత్నించారు. అదే ముఠా ఏటీఎంను అపహరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. ఏటీఎంను తరలిస్తున్న సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం రాకతో ఆదిలాబాద్ శివారులో ఏటీఎంను వదిలి పరారయ్యారు. సీసీ కెమెరా ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.