సరదాగా సెర్బియా వెళ్లిరా.. అంతా పోలీసులే చూసుకుంటారు!

  • IndiaGlitz, [Saturday,August 24 2019]

తిరుమల ఆర్టీసీ బస్సులో అన్యమత ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభుత్వమే ఈ పనిచేయిస్తోందని ప్రతిపక్షాలు.. గత ప్రభుత్వం హయాంలోనే ఈ టికెట్లు ముద్రించబడ్డాయని అధికార పార్టీ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ తరుణంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాల్సిందే..!
‘తిరుమల ఆర్టీసి టికెట్ల వెనక మైనారిటీలను జెరూసలేం, మక్కాలకు తీసుకెళ్లే చంద్రన్న పథకాలను టీడీపీ హయాంలోనే ముద్రించారు. ఇప్పుడు ఏమీ తెలియనట్లు అన్యమత ప్రచారం అని విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కేవలం 3 నెలలకే ఇంతలా బట్టలు చించుకుంటే చంద్రబాబు మిగిలిన ఐదేళ్లు ఎలా తట్టుకుంటారు..?. ఏదేమైనా చంద్రబాబును మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాల్సిందే’ అని ట్విట్టర్ వేదికగా విజయసాయి సెటైర్ వేశారు.

బుద్దా స్ట్రాంగ్ కౌంటర్..!
తుగ్లక్ ముఖ్యమంత్రి పాలన చూసి మీకు మైండ్ కూడా పోయింది. మీకిప్పుడు మెంటల్ 4వ దశకు చేరుకుంది. మీకు ట్రీట్మెంట్ ఇచ్చే ఆసుపత్రులు మన దేశంలో అయితే లేవు. సరదాగా ఒకసారి సెర్బియా వెళ్లి రారాదు, అంతా అక్కడి పోలీసులు చూసుకుంటారు!!.

విజయసాయిరెడ్డి.. తాతయ్యా 3 నెలలకే వణుకుతున్నారు ఎందుకో? మూడు నెలల తుగ్లక్ ప్రభుత్వంలో తప్పుడు పనులు చేసి దొరికిపోవడం తప్ప మీరు సాధించింది ఏంటి? తిరుమలలో వైకాపా ప్రభుత్వం అన్యమత ప్రచారం చెయ్యాలని చంద్రబాబు ప్రభుత్వం జీఓ ఇచ్చిందా? అలా అని కలగన్నారా? అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిపై బుద్దా వరుస ట్వీట్స్ చేశారు. అయితే ఈ ట్వీట్లపై విజయసాయి ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

'కౌసల్య కృష్ణమూర్తి' చాలా గొప్ప సినిమా.. అని వస్తోన్న అప్రిసియేషన్ కి  మేమెంతో గర్వపడుతున్నాం - కె.ఎస్‌. రామారావు

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఇకలేరు..

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

సరికొత్త లుక్‌తో షాకిచ్చిన రవితేజ

తెలుగు సినిమా ట్రెండ్ మారుతుంది. స్టార్ హీరోలు కథలు, పాత్రల ప్రకారం కొత్తగా కనపడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందనలు పొందిన 'నీ కోసం' టీం.. సెప్టెంబర్ 6న రిలీజ్

మంచి ఎక్కడున్నా ప్రొత్స్హహించే పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘నీకోసం’ ని అభినందించి బెస్ట్ విషెస్ తెలిపారు.

బన్నీ జతగా బాలీవుడ్ హీరోయిన్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల.. వైకుంఠపురంలో..’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.