close
Choose your channels

సరదాగా సెర్బియా వెళ్లిరా.. అంతా పోలీసులే చూసుకుంటారు!

Saturday, August 24, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సరదాగా సెర్బియా వెళ్లిరా.. అంతా పోలీసులే చూసుకుంటారు!

తిరుమల ఆర్టీసీ బస్సులో అన్యమత ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభుత్వమే ఈ పనిచేయిస్తోందని ప్రతిపక్షాలు.. గత ప్రభుత్వం హయాంలోనే ఈ టికెట్లు ముద్రించబడ్డాయని అధికార పార్టీ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ తరుణంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాల్సిందే..!
‘తిరుమల ఆర్టీసి టికెట్ల వెనక మైనారిటీలను జెరూసలేం, మక్కాలకు తీసుకెళ్లే చంద్రన్న పథకాలను టీడీపీ హయాంలోనే ముద్రించారు. ఇప్పుడు ఏమీ తెలియనట్లు అన్యమత ప్రచారం అని విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కేవలం 3 నెలలకే ఇంతలా బట్టలు చించుకుంటే చంద్రబాబు మిగిలిన ఐదేళ్లు ఎలా తట్టుకుంటారు..?. ఏదేమైనా చంద్రబాబును మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాల్సిందే’ అని ట్విట్టర్ వేదికగా విజయసాయి సెటైర్ వేశారు.

బుద్దా స్ట్రాంగ్ కౌంటర్..!
"తుగ్లక్ ముఖ్యమంత్రి పాలన చూసి మీకు మైండ్ కూడా పోయింది. మీకిప్పుడు మెంటల్ 4వ దశకు చేరుకుంది. మీకు ట్రీట్మెంట్ ఇచ్చే ఆసుపత్రులు మన దేశంలో అయితే లేవు. సరదాగా ఒకసారి సెర్బియా వెళ్లి రారాదు, అంతా అక్కడి పోలీసులు చూసుకుంటారు!!.

విజయసాయిరెడ్డి.. తాతయ్యా 3 నెలలకే వణుకుతున్నారు ఎందుకో? మూడు నెలల తుగ్లక్ ప్రభుత్వంలో తప్పుడు పనులు చేసి దొరికిపోవడం తప్ప మీరు సాధించింది ఏంటి? తిరుమలలో వైకాపా ప్రభుత్వం అన్యమత ప్రచారం చెయ్యాలని చంద్రబాబు ప్రభుత్వం జీఓ ఇచ్చిందా? అలా అని కలగన్నారా?" అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిపై బుద్దా వరుస ట్వీట్స్ చేశారు. అయితే ఈ ట్వీట్లపై విజయసాయి ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.