బిగిల్ సినిమా చూపించి చికిత్స.. డాక్టర్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి

  • IndiaGlitz, [Thursday,July 08 2021]

పేషంట్లని డాక్టర్లు ప్రేమించాలని, ఫ్రెండ్లీగా ఉండాలని మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో చూశాం. చెన్నైలో ఓ డాక్టర్ అక్షరాలా ఇదే ఫార్ములా ఫాలో అయ్యాడు. పదేళ్ల పిల్లాడికి విజయవతంగా చికిత్స పూర్తి చేశాడు. సాధారణంగా చిన్న పిల్లలు ఆసుపత్రి అంటే భయంతో వణికిపోతుంటారు.

ఇదీ చదవండి:  బిజీగా పుష్పరాజ్.. రంగంలోకి రంగమ్మత్త!

ఇంజక్షన్ వేసే సమయంలో అయితే వారిని ఆపడం ఎవరి తరమూ కాదు. అందుకే చిన్న పిల్లల విషయంలో వైద్యులు చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవుతుంటారు. వివరాల్లోకి వెళితే.. చెన్నై మైలాపూర్ కు చెందిన శశి అనే పదేళ్ల కుర్రాడు తన మేనమామతో కలసి సరదాగా బైక్ రైడ్ కు వెళ్ళాడు.

ప్రమాదవశాత్తూ బైక్ నుంచి శశి పడిపోయాడు. దీనితో అతడి తలకు పెద్ద గాయమే అయ్యింది. దీనితో శశిని వెంటనే రాయ్ పేట్ లోని ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్రంగా రక్త స్రావం అవుతుండడంతో వెంటనే కుట్లు వేయాలని వైద్యులు సూచించారు.

కుట్లు వేసే ముందు మత్తు ఇంజక్షన్ ఇచ్చే ప్రయత్నం చేశారు డాక్టర్. కానీ శశి అందుకు ససేమిరా అంగీకరించలేదు. ఇంజక్షన్ వేయొద్దు అంటూ గట్టిగా కేకలు పెట్టాడు. దీనితో వైద్యులకు ఏం చేయాలో అర్థం కాలేదు. దీనితో మరో వైద్యుడు శశి వద్దకు వెళ్లి మాటామాటా కలిపాడు. తనకు ఏ హీరో అంటే ఇష్టమో అడిగి తెలుసుకున్నాడు. శశికి ఇలయథలపతి విజయ్ అంటే ఇష్టం అని డాక్టర్ గ్రహించాడు.

దీనితో వెంటనే ఫోన్ లో బిగిల్ చిత్రాన్ని ప్లే చేసి శశికి ఇచ్చాడు. శశి సినిమాలో లీనమైపోవడంతో వైద్యులు తమ పని సులువుగా పూర్తిచేసేశారు. శశికి విజయవంతంగా చికిత్స పూర్తయింది. ఈ న్యూస్ గురించి తెలుసుకున్న వైద్యులు ఆ డాక్టర్ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటూ అభినందిస్తున్నారు.

More News

బిజీగా పుష్పరాజ్.. రంగంలోకి రంగమ్మత్త!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప' షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది.

'జీ 5'లో జూలై 9న ఒరిజినల్‌ మూవీ 'స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌ : టెంపుల్‌ అటాక్‌' విడుదల

ప్రపంచవ్యాప్తంగా భారతీయ కంటెంట్ కోరుకునే వీక్షకుల కోసం వివిధ భాషలు, వివిధ జోనర్లలో అర్థవంతమైన, ప్రయోజనకరమైన కంటెంట్‌ అందించే భారతదేశపు అతి పెద్ద ఓటీటీ వేదిక 'జీ 5'.

మా బావగారు అంటూ వైఎస్ఆర్ పై మోహన్ బాబు ఎమోషనల్ కామెంట్స్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు.

రాంచరణ్ తర్వాత సమంత.. ఎంత కాస్ట్లీ అయినా ఓకే, అందుకేనా!

పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టేలా దూసుకుపోతోంది టాలీవుడ్. బాహుబలి తర్వాత ఈ సాంప్రదాయం మొదలయింది అని చెప్పొచ్చు.

డాక్టర్లూ ఈ వీడియో మీ దగ్గర పెట్టుకోండి.. ఇంత నిర్లక్ష్యమా, వందలాదిమంది ఇలా.. 

కరోనా మహమ్మారి విడతల వారీగా ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ఇప్పటికే మొదటి వేవ్, రెండవ వేవ్ అటూ లక్షలాది ప్రాణాలని బలితీసుకుంది మహమ్మారి.