close
Choose your channels

మా బావగారు అంటూ వైఎస్ఆర్ పై మోహన్ బాబు ఎమోషనల్ కామెంట్స్

Thursday, July 8, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు. దీనితో ఏపీ వ్యాప్తంగా వైసిపి నాయకులు, వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. పలువురు రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు కూడా వైఎస్ కు నివాళులు అర్పిస్తున్నారు. 

వైఎస్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూనే.. ప్రజలకు ఆయన చేసిన సేవలని కొనియాడుతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు మోహన్ బాబు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

'స్నేహశీలీ, రాజఠీవి, రాజకీయ దురంధరుడు, మాట తప్పడు మడమ తిప్పడు అన్న మాటకు  నిలువెత్తు నిదర్శనం,పేద ప్రజల దైవం మా బావగారైన వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు నేడు. బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయనకు ఆత్మశాంతి కలగాలని ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకి ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ మోహన్ బాబు ఎమోషల్ కామెంట్స్ చేశారు. వైఎస్ చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోని మోహన్ బాబు షేర్ చేశారు.

మోహన్ బాబు కుటుంబానికి, వైఎస్ఆర్ ఫ్యామిలీకి మంచి సాన్నిహిత్యం ఉంది. మంచు విష్ణు సతీమణి విరోనిక వైయస్ కుటుంబానికి చెందిన అమ్మాయే.

మోహన్ బాబుతో పాటు గోపీచంద్ మలినేని, కోన వెంకట్, బండ్ల గణేష్ లాంటి సినీ ప్రముఖులు వైయస్ ని గుర్తు చేసుకుంటూ నివాళుల్పించారు.

2009 సెప్టెంబర్ 2న వైయస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆరోగ్య శ్రీ ,రుణమాఫీ లాంటి సంక్షేమ పథకాలతో వైయస్ తన అభిమానులకు ఆరాధ్య నేతగా మరారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.