స‌ర్ధార్ వేదిక పై చిరు సినిమా ప్ర‌క‌ట‌న‌..

  • IndiaGlitz, [Monday,March 21 2016]

స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో వేడుక‌కు ముఖ్య అతిథిగా హాజ‌రైన చిరంజీవి ప‌నిలోపనిగా ఇదే వేదిక‌ పై త‌న సినిమా గురించి కూడా ఓ ప్ర‌క‌ట‌న చేసేసారు. ఇంత‌కీ...చిరు త‌న సినిమా గురించి ఏ ప్ర‌క‌ట‌న చేసార‌ని తెగ ఆలోచిస్తున్నారా..? త‌మిళ్ మూవీ క‌త్తి రీమేక్ లో చిరు న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో చిరు స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అయితే ఈ క్రేజీ మూవీకి సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీప్ర‌సాద్ అంటూ చిరంజీవి స‌ర్ధార్ ఆడియో వేదిక పై ప్ర‌క‌టించారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ అవ్వ‌క ముందు దేవిశ్రీ ఫాద‌ర్ స‌త్య‌మూర్తిగారు దేవిశ్రీని నా ద‌గ్గ‌ర‌కి తీసుకువస్తే...నీ టైమ్ బాగుంటుంద‌ని చెప్పి నా చేతికి ఉన్న వాచీని దేవిశ్రీప్ర‌సాద్ కి గిఫ్ట్ గా ఇచ్చాను. అప్ప‌టి నుంచి నేను చెప్పిన‌ట్టుగానే దేవిశ్రీ టైమే మారిపోయింది. ఎంత‌లా దేవిశ్రీ టైమ్ మారిపోయింది అంటే నిర్మాత‌ల‌కు టైమ్ ఇవ్వ‌లేనంత‌..నా 150 సినిమాకి మ్యూజిక్ చేయ‌మ‌ని చెప్పుదాం అనుకుంటే దేవిశ్రీ దొర‌క‌డం లేదు. ఇప్ప‌డు అభిమానులంద‌రి స‌మ‌క్షంలో చెబుతున్నాను నా 150వ సినిమాకి మ్యూజిక్ చేయాలి అని అంటే వెంట‌నే ఓకే అన్నాడు దేవిశ్రీ. అదీ సంగ‌తి.

More News

నాటకాల్లోకి రజనీకాంత్..

ఎవరైనా నాటక రంగం నుండి సినిమా రంగంలోకి రావాలనుకుంటారు. మరి కొంత మంది రెండింటిని సమానంగా హ్యండిల్ చేస్తుంటారు. అయితే సినిమా రంగంలో సూపర్ స్టార్ వెలుగుగొందుతోన్న రజనీకాంత్ నాటకంలో నటించబోతున్నాడు. ఇదేంటని అనుకుంటున్నారా..

త్రివిక్ర‌మ్ కి కూడా ప‌వ‌న్ చెప్ప‌లేద‌ట‌..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఇద్ద‌రూ మంచి మిత్రులు. వీరిద్ద‌రు క‌ల‌సి జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు చేసారు. ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ మ‌ధ్య సాన్నిహిత్యం మ‌రింత పెరిగింద‌నే విష‌యం అందరికీ తెలిసిందే.

ఏప్రిల్ 1న విడుదలవుతున్న పిడుగు

వినీత్‌, మోనికా సింగ్ హీరో హీరోయిన్లుగా వి2 ఫిల్మ్స్ ప్రై.లి. బ్యాన‌ర్‌పై రామ‌మోహ‌న్.సి.హెచ్ ద‌ర్శ‌క‌త్వంలో అశోక్ గోటి నిర్మించిన చిత్రం 'పిడుగు'. ఈ చిత్రం ద్వారా నిర్మాత అశోక్ గోటి త‌న త‌న‌యుడు వినీత్‌ను హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ఆలీ కాస్త తెలుసుకుని మాట్లాడు...

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో ప‌వ‌న్ త‌ల‌కు ఎర్ర‌తువాలు క‌ట్టుకున్నారు. ప‌వ‌న్ తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో కూడా ఎర్ర‌తువాల‌ను ఉప‌యోగించారు.

మ‌నోజ్ ఎటాక్ డేట్ ఫిక్స్

మంచు మ‌నోజ్ - బీరువా ఫేం సుర‌భి జంట‌గా న‌టించిన చిత్రం ఎటాక్. రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఎటాక్ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్ రాజ్, వ‌డ్డే న‌వీన్ ముఖ్య‌పాత్ర‌లు పోషించారు.