Revanth Reddy: మనవడితో కలిసి హోలీ సంబరాల్లో సీఎం రేవంత్ రెడ్డి

  • IndiaGlitz, [Monday,March 25 2024]

తెలుగు రాష్ట్రాల్లో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఏడాది ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు. హోలీ పండుగను హోలికా పూర్ణిమ అని కూడా పిలుస్తారు. హైదరాబాద్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హోలీ సంబరాలే కనిపించాయి. స్నేహితులు, బంధువులపై రంగులు చల్లుకుంటూ తెగ ఎంజాయ్‌ చేశారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఉదయం నుంచే.. రంగులు పట్టుకుని ఒకరిపై ఒకరు చల్లుకుంటున్నారు. ఇక రాజకీయ నేతలు కూడా తామేమీ తక్కువ కాందంటూ హోలీ సంబరాల్లో పాల్గొని సందడి చేశారు.

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కూడా హైదరాబాద్‌లోని తన నివాసంలో మనవడు రేయాన్స్‌తో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. భార్య గీతారెడ్డితో కలిసి మనవడిపై రంగులు చల్లుతూ ఉత్సాహంగా కనిపించారు. తాత ఒళ్లో కూర్చుని రేయాన్స్ చిరునవ్వులు చిందించాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిజీ లైఫ్‌లో కాసేపు మనవడితో కలిసి సరదాగా సేద తీరుతున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. కొల్లాపూర్‌లో బైక్‌పై తిరుగుతూ వ్యాపారస్తులకు, ప్రజలకు రంగులు పూస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. పారిశుధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు, కూలీలతో కలిసి పండుగ జరుపుకున్నారు. బండి సంజయ్‌ ఇంటి దగ్గరకు బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు చేరుకున్నారు. బైక్‌పై గల్లీ గల్లీ తిరుగుతూ కనిపించిన వారిందరికీ రంగులు పూసి ఉత్సాహంగా కనిపించారు. ఆటో డ్రైవర్లు, కూలీలు, చిరు వ్యాపారులు, చిన్నపిల్లలతో కలిసి హోలీ ఆడారు.

మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా హోలీ సంబరాల్లో పాల్గొని రంగులు చల్లుకుంఎటూ ఫుల్‌ ఎంజాయ్ చేశారు. వరంగల్‌ వెస్ట్‌ ఎమ్మెల్యే నాయిని రాజేంద్రనాధ్‌ కార్యకర్తలు, అభిమానులతో కలిసి పండుగ జరుపుకున్నారు. భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం నాగయ్య పల్లి తండాలో ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య గిరిజనులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత కూడా హోలీ సంబరాల్లో పాల్గొని సందడి చేశారు.

అటు ఏపీలోనూ రాజకీయ నేతలు హోలీ వేడుకల్లో హల్‌చల్ చేశారు. ముఖ్యంగా మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గంలో బైక్‌పై తిరుగుతూ ప్రజలకు రంగులు పూస్తూ హోలీ జరుపుకున్నార. అనంతరం మహిళలు, చిన్నారులతో కలిసి స్టెప్పులు వేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. ఈయనతో పాటు అనేక మంది నేతలు హోలీ వేడుకల్లో పాల్గొని సేద తీరారు.

More News

IPL Schedule 2024: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది..

క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇప్పటికే తొలి విడతలో 21 మ్యాచ్‌లకు మాత్రమే షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Chandrababu: అధికారంలోకి వస్తే రూ.4వేల పింఛన్ ఇంటికే తెచ్చిస్తాం: చంద్రబాబు

తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.4వేల పింఛన్ ఇంటి వద్దకే తెచ్చి ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తెలిపారు.

Gali Janardhan Reddy: బీజేపీలో చేరిన మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి.. పార్టీ విలీనం..

కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్‌ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి(Gali Janardhana Reddy) తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల ముందు కల్యాణరాజ్య ప్రగతి పక్ష పార్టీని స్థాపించారు.

Sugunamma: తిరుపతి సీటుపై పునరాలోచించాలి.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కంటతడి..

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో భాగంగా కొంతమంది నేతలకు టికెట్ దక్కలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతలు పొత్తులో టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.

RC17: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'రంగస్థలం' కాంబో రిపీట్..

గ్లోబల్‌ స్టార్ రామ్ చరణ్(Ram Charan), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ దగ్గర ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.