close
Choose your channels

ఏపీలో లక్ష దాటిన కరోనా కేసులు.. నేడు ఎన్నంటే..

Monday, July 27, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో కరోనా కేసులు నేడు కాస్త తగ్గాయి. దీనికి ఇవాళ కాస్త తక్కువగా పరీక్షలు నిర్వహించడం కూడా కారణమై ఉండవచ్చు. రోజూ 50 వేలకు పైన పరీక్షలు నిర్వహిస్తుండగా.. నేడు 43,127 శాంపిళ్లను పరీక్షించినట్టు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకూ నమోదైన కేసులు మాత్రం లక్ష దాటడం గమనార్హం. ఏపీకి చెందిన కరోనా హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో 6051 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,02,349కు చేరుకుంది. కాగా ప్రస్తుతం ఏపీలో 51,701 యాక్టివ్ కేసులున్నాయి. 49,558 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా నేడు ఒక్కరోజే కరోనాతో 49 మంది మృతి చెందగా.. మొత్తంగా ఇప్పటి వరకూ 1090 మంది మృతి చెందారు. కాగా నేడు కూడా ఈస్ట్ గోదావరిలోనే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ గోదావరిలో 1210 కేసులు నమోదయ్యాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.