close
Choose your channels

ఏపీలో నేడు 800 దాటిన కరోనా కేసులు

Sunday, June 28, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో నేడు కరోనా పాజిటివ్ కేసులు 800 దాటాయి. గడిచిన 24 గంటల్లో 25వేల 778 నమూనాలను పరిశీలించగా.. 813 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13 వేల 098కి చేరుకుంది. కాగా నేడు నమోదైన 813 కేసుల్లో రాష్ట్రానికి చెందినవి 755 కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 50మంది, విదేశాల నుంచి వచ్చిన వారు 8 మంది ఉన్నారు.

నేడు కరోనా కారణంగా 12 మంది మృతి చెందారు. మృతుల్లో కర్నూల్ జిల్లాకు చెందిన వారు ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు ఉన్నారు. దీంతో మృతుల సంఖ్య 169కి చేరింది. 5908 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. 7021 యాక్టివ్ కేసులున్నాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.