పుట్టింట్లో మరోమారు కల్లోలం రేపుతున్న కరోనా మహమ్మారి..

  • IndiaGlitz, [Friday,January 08 2021]

కరోనా మహమ్మారి తన పుట్టింట్లో మరోమారు కల్లోలం రేపుతోంది. 2019లో వూహాన్‌లో పుట్టిన ఈ మహమ్మారిని ఆ దేశస్తులు త్వరగానే వదిలించుకున్నారు. ఆ తర్వాత ఇటీవలి కాలం వరకూ ఈ మహమ్మారి జాడ చైనాలో కనిపించలేదు. ఈ మహమ్మారిని వదిలించుకునేందుకు చైనా అధికారులు ఎన్నో కష్టాలు పడ్డారు. భారీగా కరోనా టెస్టింగ్‌లు, లాక్‌డౌన్ ఏం చేస్తేనేమి మొత్తానికి కరోనా మహమ్మారినైతే పారద్రోలారు. తిరిగి ఇన్నాళ్లకు కరోనా జాడలు తిరిగి కనిపించాయి. రాజధాని బీజింగ్‌కు దక్షిణాన ఉండే హెబై ప్రావిన్స్‌లో రెండు సిటీల్లో కరోనా కోరలు చాస్తోంది. హెబై ప్రావిన్స్‌లో తాజాగా 127 సింప్టమాటిక్ కరోనా కేసులు... 183 అసింప్టమాటిక్ కేసులు వెలుగు చూశాయి.

చైనాలో ఇన్ని కేసులు వెలుగు చూడటం 2019 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇన్ని కేసులు ఒక్కసారిగా బయటపడటంతో అప్రమత్తమైన అధికారులు హెబై ప్రావిన్స్‌లోని షిజియాషాంగ్, జింగ్టాయ్ సిటీల్లో లాక్‌డౌన్ విధించారు. అక్కడి ప్రజలకు అధికారులు పలు ఆంక్షలు విధించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశించారు. అలాగే హెబై ప్రావిన్స్ నుంచి బీజింగ్‌కు వెళ్లే వాహనాలపై కూడా ఆంక్షలు విధించారు. కాగా.. విదేశాల నుంచి తిరిగొచ్చిన వ్యక్తులతో పాటు ఇతర దేశాల నుంచి దిగుమతి అయిన ఆహార పదార్థాల కారణంగానే మరోమారు కరోనా కల్లోలం రేపుతోందని అధికారులు చెబుతున్నారు.

More News

'మాస్టర్‌' అన్నీ వర్గాలను మెప్పించే ఫీస్ట్‌లా ఉంటుంది - డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌

దళపతి విజయ్‌ కథానాయకుడిగా నగరం, ఖైది చిత్రాలతో సెన్సేషల్‌ హిట్స్‌ సాధించిన డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో

వాట్సప్‌పై ఎందుకింత చర్చ? కొత్త ప్రైవసీ రూల్స్‌లో ఏముంది?

దేశవ్యాప్తంగా వాట్సప్ ప్రైవసీ రూల్స్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా ఇదే అంశం ట్రెండింగ్‌లో ఉంది.

అధీర పాత్ర కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది: సంజయ్ దత్

హీరో యశ్ బర్త్‌డే సందర్భంగా ‘కేజీఎఫ్ 2’ టీజర్ విడుదలై దుమ్ము రేపుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ముఖ్యంగా హైలైట్ అవుతోంది..

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘కేజీఎఫ్ 2’ టీజర్..

కన్నడలో తెరకెక్కి అనూహ్య విజయం సాధించిన కేజీఎఫ్ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రం ‘కేజీఎఫ్-2’.

ప్రియురాలి బెదిరింపుతో వరుడు పరార్... ఆ తర్వాతేం జరిగిందంటే..

‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని.. జరిగేవన్నీ మంచికని.. అనుకోవడమే మనిషి పని’ అన్నాడో కవి.