close
Choose your channels

ప్రియురాలి బెదిరింపుతో వరుడు పరార్... ఆ తర్వాతేం జరిగిందంటే..

Thursday, January 7, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని.. జరిగేవన్నీ మంచికని.. అనుకోవడమే మనిషి పని’ అన్నాడో కవి. ఇది ప్రతి ఒక్కరి జీవితానికి ఏదో ఒక సమయంలో వర్తిస్తూనే ఉంటుంది. తాజాగా చిక్ మంగుళూరులో ఓ వివాహం విషయంలో అక్షరాలా ఇదే జరిగింది. అమ్మాయికి ఒక యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశాక.. పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్న సమయంలో వరుడు జంప్ అయ్యాడు. దీంతో వివాహ వేడుకకు హాజరైన మరో యువకుడు ఆ యువతిని పెళ్లాడాడు. ప్రస్తుతం ఈ వివాహం కర్ణాటకలో హాట్ టాపిక్‌గా మారింది.

కర్నాటకలోని చిక్‌మంగళూరు జిల్లా తిరికరె తాలూకాలోని ఒక గ్రామంలో అశోక్, నవీన్ అనే సోదరులకు ఒకే వేదికపై వివాహం జరిపించాలని పెద్దలు నిశ్చయించారు. వీరిద్దరి వివాహం కొద్దిసేపట్లో జరగాల్సి ఉంది. అప్పుడే అనుకోని సమస్య తలెత్తింది. నవీన్ అతనికి కాబోయే భార్య సింధుకు పెళ్లికి ముందు జరిగే తంతు పూర్తయ్యింది. అయితే పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న తరుణంలో సడెన్‌గా పెళ్లి మండపం నుంచి నవీన్ మాయమయ్యాడు. అతని ప్రియురాలు ఈ పెళ్లి చేసుకుంటే విషం తాగుతానని బెదిరించడంతో నవీన్ అక్కడి నుంచి పరారయ్యాడని బంధువులు చెబుతున్నారు.

కాగా నవీన్ సోదరుడు అశోక్ వివాహం మాత్రం సవ్యంగానే సాగింది. అయితే సింధు‌ వివాహం పీటల వరకూ వచ్చి ఆగిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏం చేయాలో పాలుపోని స్థితికి వచ్చారు. తరువాత కాస్త తేరుకుని వారు ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వివాహ వేడుకకు వచ్చిన చంద్రప్ప అనే యువకుడితో సింధుకు వివాహం చేయాలని నిశ్చయించారు. చంద్రప్ప బీఎంటీసీలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఈ వివాహానికి చంద్రప్ప కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. అదే వేదికపై సింధు, చంద్రప్పల వివాహం జరిగింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.