దేశంలో 20 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. వరుసగా ఏడో రోజు కూడా..

  • IndiaGlitz, [Thursday,August 06 2020]

దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మరి విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులు 20 లక్షలకు చేరువయ్యాయి. వరుసగా ఏడవ రోజు సైతం కరోనా కేసులు 50 వేలు దాటాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 56,282 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,64,596కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 904 మంది మృతి చెందగా... ఇప్పటి వరకూ మొత్తం మృతుల సంఖ్య 40,699కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం 5,95,501 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా నుంచి ఇప్పటి వరకూ 13,28,337 మంది బాధితులు కోలుకున్నారు.

More News

తెలంగాణలో తాజాగా 2092 కరోనా కేసులు..

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ హెల్త్ బులిటెన్‌ను గురువారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూత

టీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు.

సుశాంత్ సీబీకి.. ధృవీకరించిన సీబీఐ అధికార ప్రతినిధి

బాలీవుడ్ క‌థానాయ‌కుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.

‘జీ 5’లో జ్యోతిక, కార్తీ నటించిన ‘దొంగ’ వరల్డ్‌ డిజిటల్‌ ప్రీమియర్‌

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ స్పెషల్‌ సినిమాను ‘జీ 5’ ఒటీటీ తెలుగు ప్రజల ముందుకు తీసుకొస్తోంది.

భారత్‌లో కరోనా.. డిశ్చార్జ్‌లలో ఇదే రికార్డ్..

భారత్‌లో రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే విశేషం ఏంటంటే..