సడలింపులే కొంపముంచాయా.. లాక్ డౌన్ 4.0 పక్కానా!?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మిగతా దేశాలతో పోలిస్తే ఇండియా చాలా బెటర్. ఇందుకు కారణం లాక్ డౌన్.. ఇది ఎవరు ఒప్పుకున్నా.. నమ్మినా నమ్మకపోయినా అక్షర సత్యం. అయితే మూడోసారి లాక్ డౌన్ విధించినప్పుడు కేంద్రం కొన్నింటికి సడలింపులు ఇచ్చింది. దీంతో అప్పటి వరకూ కాస్తో కూస్తో కరోనా కేసులు దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగిపోయాయ్. అప్పటి వరకూ వందల్లో ఉండే కేసులు వేలకు పెరిగిపోయాయ్. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో అయితే రోజుకు ఆరేడు వందలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఇందుకు కారణం సడలింపులే.. ఇందులో ముఖ్యంగా మద్యం అమ్మకాలే అని కొందరు విశ్లేషకులు, నిపుణులు చెబుతున్నారు.

సీన్ మొత్తం రివర్స్..!?
లాక్ డౌన్‌తో కేసులు తగ్గుతాయోమో..? అని ఎక్కడో చిన్న ఆశ ఉండేది అయితే 3.0 ముగిసే సరికి వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం భారతీయులను కలవరపాటుకు గురిచేస్తోంది. మరీ ముఖ్యంగా గత 24 గంటల్లో 2487 కొత్త కేసులు నమోదవడం ఇండియాలో భయానక పరిస్థితిని చాటుతోందని నిపుణులు చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నంబరింగ్ చూస్తుంటే యూరప్ దేశాల్లో పరిస్థితి గుర్తుకొస్తోంది. ఇవాళ నమోదైన కేసులతో ఇండియాలో కేసుల సంఖ్య 40 వేలు దాటేయడం గమనార్హం. అంతేకాదు.. మరోవైపు మరణాలు కూడా ఒకే ఒక్కరోజులో 83 కావడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఓ వైపు రోజురోజుకూ కేసుల తీవ్రత పెరగడం.. మరోవైపు మరణాలు పెరగడం.. ఇంకోవైపు అనుమానితుల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతుండటంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కేసుల్లో ఎక్కడో ఉండే ఇండియా.. రోజురోజుకూ దేశాలు దాటిపోతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 12వ స్థానంలో ఉండటం గమనార్హం. మొత్తానికి చూస్తే లాక్ ‌డౌన్ విధిస్తే పరిస్థితులు అనుకూలిస్తాయ్.. కేసులు తగ్గుతాయ్ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్నాయ్ కానీ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. అది కూడా లాక్ డౌన్ అమలులో ఉన్నప్పుడు కావడం గమనార్హం.

పక్కాగా 4.0?

మొదటి ఒకట్రెండు లాక్‌డౌన్‌లో కాస్త కేసులు అదుపులోనే ఉన్నాయ్.. అందుకే 3.0 విధిస్తే కచ్చితంగా కంట్రోల్ అవుతుందని కేంద్రం భావించింది. అయితే సడలింపులు ఇవ్వడంతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇదే కొంపముంచిందని కూడా నిపుణులు చెబుతున్నారు. అందుకే 4.0 లాక్ డౌన్ విధించి ఈసారి సర్వం బంద్ చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలియవచ్చింది. సోమవారం నాడు జరిగిన సీఎంలతో పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎక్కువ మంది ముఖ్యమంత్రులు పొడిగించాల్సిందేనని చెప్పినట్లు తెలియవచ్చింది. అయితే కొందరు ఈ నెల చివరికి అని చెప్పగా మరికొందరేమో జూన్ రెండో వారం వరకూ లాక్ డౌన్ విధించాల్సిందేనని ప్రధానిని పట్టుబట్టారట.

వీటి పరిస్థితేంటో..?

మే-12 నుంచి దేశ వ్యాప్తంగా కొన్ని రైళ్లు నడవనున్నాయ్.. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ కూడా అయ్యాయ్. మరోవైపు త్వరలోనే బస్సులు కూడా తిరుగుతాయని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చాడు. మరోవైపు విమానాలు ఇప్పటికే కొన్ని తిరుగుతున్నాయ్. లాక్ డౌన్ 4.0 తప్పదు అనుకున్న టైమ్‌లో వీటి పరిస్థితేంటి..? అనేది ప్రశ్నార్థకంగానే మారింది. ఇంకోవైపు ఇంకా పూర్తిగా వలసకార్మీకులను వారి స్వరాష్ట్రాలకు పంపేందుకు చర్యలూ కొనసాగుతున్నాయ్. ఇలాంటి తరుణంలో 4.0 లాక్ డౌన్ విధిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయ్ అని కేంద్రం నిపుణుల కమిటీతో నిశితంగా చర్చించి ఒకట్రెండు రోజుల్లో నిర్ణయించి పొడిగింపుపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలియవచ్చింది. మరి ఆ ప్రకటన ఎప్పుడు వస్తుందో..? ఏమని వస్తుందో..? తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

More News

జగన్ నిర్ణయంపై కేసీఆర్ అభ్యంతరం.. న్యాయపోరాటం!

టైటిల్ చూడగానే ఇదేంటి.. నిన్న మొన్నటి వరకూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి సఖ్యతగా ఉన్నారు కదా..? సడన్‌గా ఏమైంది..? అసలేం జరిగింది..?

క్షమించండి.. రాజకీయాలొద్దు.. సినిమాలే ముద్దు!

అవును మీరు వింటున్నది నిజమే.. టాలీవుడ్ నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి తన తప్పును తెలుసుకుని తన అభిమానులు, సినీ ప్రియులకు క్షమాపణలు చెప్పాడు.

సన్నీ.. ముంబై దాటి అమెరికా ఎలా వెళ్లింది!?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇండియాలో రోజురోజుకు విస్తరిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.

పవన్ ఫ్యాన్స్‌‌కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన హరీశ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్‌’ మూవీని హరీశ్ శంకర్ తెరకెక్కించి సరిగ్గా ఎనిమిదేళ్లయ్యింది. ఈ సినిమాతో హరీశ్ రేంజ్ ఎక్కడికెళ్లిపోయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

భారీగా పెరిగిన కరోనా కేసులు.. భాగ్యనగరంలో భయం భయం

తెలంగాణలో కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. గత రెండువారాలుగా సింగిల్ డిజిట్‌లో మాత్రమే నమోదైన కేసులు నాలుగైదు రోజులుగా మునుపటి కంటే రెట్టింపు కేసులు నమోదవుతుండటం గమనార్హం.