close
Choose your channels

భారీగా పెరిగిన కరోనా కేసులు.. భాగ్యనగరంలో భయం భయం

Tuesday, May 12, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భారీగా పెరిగిన కరోనా కేసులు.. భాగ్యనగరంలో భయం భయం

తెలంగాణలో కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. గత రెండువారాలుగా సింగిల్ డిజిట్‌లో మాత్రమే నమోదైన కేసులు నాలుగైదు రోజులుగా మునుపటి కంటే రెట్టింపు కేసులు నమోదవుతుండటం గమనార్హం. నిన్న మొన్నటి వరకూ 30,31 నమోదైన కేసులు సోమవారం రోజుకు మాత్రం భారీగా పెరిగిపోయాయ్. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో మరో 79కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది. అయితే.. ఇవాళ నమోదైన కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే కావడం గమనార్హం. చాలా రోజులుగా నగరంలో చాలా తక్కువగానే కేసులు నమోదవుతున్నాయి.

భయం.. భయం..!

అయితే ఇలా ఒక్కసారిగా కేసులు పెరిగిపోవడం భాగ్యనగరవాసుల్లో భయం భయం నెలకొంది. ఇవాళ నమోదైన 79 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1275కు చేరుకుంది. ఇవాళ 50 మంది కరోనాను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. మొత్తం ఇప్పటి వరకూ 801 మంది డిశ్చార్జి అయ్యారు. అయితే ఇప్పటి వరకూ 30 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 44 యాక్టివ్ కరోనా కేసులున్నాయని ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

లాక్ డౌన్ పొడిగింపే!?

రోజురోజుకు ఇలా కరోనా కేసులు పెరుగుతుండటాన్ని బట్టి చూస్తే కచ్చితంగా మరోసారి లాక్ డౌన్ పొడిగించాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది. ముఖ్యంగా ఎక్కడపడితే వాహనాల్లో తిరిగేయడం.. మరీ ముఖ్యంగా ఎక్కడ చూసినా జనాలే.. ఏ చెక్ పోస్ట్ దగ్గర చూసినా.. ఏ సిగ్నల్ దగ్గర చూసినా జనాలే జనాలున్నారు. మద్యం షాపులు తెరవడం కూడా ఇందుకు ఓ కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాగైతే హైదరాబాద్ వ్యాప్తంగా సడలింపులు కచ్చితంగా ఎత్తేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదివరకు లాగా కాకుండా మరింత కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.