దిల్రాజు ఆ సినిమాను ఆపేశాడా...
- IndiaGlitz, [Tuesday,January 15 2019]
విజయవంతమైన సినిమాలను తెరకెక్కించే నిర్మాతగా పేరున్న దిల్రాజు బ్యానర్లో ఇప్పటి వరకు నాగచైతన్య 'జోష్' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మరో హీరోను దిల్రాజు తెలుగు తెరకు పరిచయం చేయలేదు. ఇప్పుడు గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ను హీరోగా పరిచయం చేయడానికి సిద్ధమయ్యాడు.
ఈ సినిమాలో నభా నటేశ్ను హీరోయిన్గా అనుకున్నారు. సినిమా కూడా ప్రారంభమైంది. మధ్య డైరెక్టర్ను కూడా మార్చారు. టర్కీష్ మూవీకి ఇది రీమేక్ అనే వార్తలు కూడా వినపడ్డాయి.
ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వినపడుతున్నాయి. కారణాలు మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం దిల్రాజు 'ఎఫ్ 2' సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు.