రామ్ సినిమా తోనూ కొన‌సాగించిన ద‌ర్శ‌కుడు

  • IndiaGlitz, [Friday,March 09 2018]

గ‌తేడాది విడుద‌లైన 'నేను లోకల్' సినిమాతో ద‌ర్శ‌కుడిగా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు త్రినాథరావు నక్కిన. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్.. రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కుతున్న 'హలో గురు ప్రేమ కోసమే' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం.. గురువారం హైదరాబాద్ లో ప్రారంభమైంది.

మార్చి 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇదిలా ఉంటే.. ఈ దర్శకుడు తెరకెక్కించిన సినిమాల టైటిల్స్ అన్ని ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా.. హిట్ అయిన సినిమాల పాటల పల్లవులలోని లైన్ లను తన సినిమాలకు టైటిల్స్ గా పెట్టడం ఈ దర్శకుడికి ఆనవాయితీగా మారింది.

ఓసారి త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలపై లుక్కేస్తే.. 'మేం వయసుకు వచ్చాం' ('7/జి బృందావనం కాలనీ'), 'ప్రియతమా నీవచట కుశలమా..!' ('గుణ'), 'సినిమా చూపిస్త మావ' ('రేసు గుర్రం'), ప్రస్తుతం 'హలో గురు ప్రేమ కోసమే' ('నిర్ణయం').. ఇలా త‌న సినిమాల టైటిల్స్ అన్నీ పాపుల‌ర్ పాట‌ల ప‌ల్ల‌వుల నుంచి పుట్టిన‌వే కావ‌డం విశేషం. ఒక్క‌ 'నేను లోకల్' మాత్ర‌మే ఇందుకు విరుద్ధంగా ఉంది. మున్ముందు కూడా ఆయ‌న ఇదే సంప్ర‌దాయాన్ని కొన‌సాగిస్తారేమో చూడాలి.

More News

నిఖిల్ రెండు చిత్రాలు అలాగే..

యువ క‌థానాయకుడు నిఖిల్ గ‌త రెండేళ్ళుగా ఏడాదికో సినిమాతో సంద‌డి చేసారు. అయితే ఈ ఏడాది మాత్రం రెండు సినిమాలతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. విశేష‌మేమిటంటే.. ఆ రెండు చిత్రాలు కూడా రీమేక్ సినిమాలు కావ‌డం. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. ఈ నెల 16న నిఖిల్ తాజా చిత్రం 'కిరాక్ పార్టీ' విడుద‌ల కానుంది.

'కొండవీటి దొంగ' కు 28 ఏళ్ళు

''ఉన్నవాడిని కొల్లగొట్టి లేనివాడికి పెట్టు" అనే రాబిన్ హుడ్ సిద్ధాంతంతో తెరకెక్కిన చిత్రం 'కొండవీటి దొంగ'. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే మరో మైలురాయిగా నిలిచిన హిట్ మూవీ ఇది.

మీ లైక్స్ కోసం ఇలా చేయకండి: శ్రీకాంత్

ఇటీవల సోషల్ మీడియా లో కొంతమంది చేస్తున్న అకృత్యాలను చూస్తుంటే మీడియా పైనే విసుగుపుట్టేలా అనిపించడం ఖాయం.. వారి వీడియోలకు లైకులు రావడం  కోసం, వ్యూస్ పెరగడం కోసం కొన్ని సంస్థలు చేస్తున్న తీరు ఆడియోన్స్ నే కాదు సెలెబ్రెటీలను సైతం చిరాకు తెప్పిస్తోంది..  గాసిప్స్  అంటే కొంత తెలిసి మరికొంత తెలియని విషయాన్ని ఆరోగ్యకరంగా చెప్పడమో.. లే

విడుదలకు సిద్ధమైన మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు'

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'అభిమన్యుడు'. ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు.

నాలో ప్రేమ‌ నువ్వేనా లొగొ లాంఛ్

జై చిరంజీవ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై వాసు దేవ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తొన్న చిత్రం‌ "నాలో ప్రేమ నువ్వేనా". చిత్రీకరణ పూర్తి చెసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.