మహిళా జర్నలిస్ట్‌పై మండిపడ్డ డైరెక్టర్ మారుతి..

  • IndiaGlitz, [Monday,September 14 2020]

మాతృత్వం ఓ గొప్ప వరం. అమ్మ అవడం అనేది ప్రతి మహిళకు మరో జన్మ. ప్రతి మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు ఏదో తెలియని ఆనందాన్ని పొందుతుంది. అలాంటి ఆనందాన్నే ప్రస్తుతం టీమిండియా సారధి విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ పొందుతోంది. అయితే అనుష్కపై ఓ మహిళా జర్నలిస్ట్ అవమానకరమైన వ్యాఖ్యలు చేసింది. దీనిపై టాలీవుడ్ డైరెక్టర్ మారుతి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీనా దాస్ నారాయణ్ అనే మహిళా జర్నలిస్ట్ అనుష్క పోస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘అనుష్క, ఆయన మిమ్మల్ని గర్భవతిని మాత్రమే చేసాడు, ఇంగ్లాండ్ రాణిని కాదు, మీ గుర్రాలకు కాస్త కళ్లెం వేయండి’’ అంటూ అసభ్యకరమైన ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. ఈ ట్వీట్‌పై డైరెక్టర్ మారుతి కూడా స్పందించారు. ఒక మహిళా జర్నలిస్ట్ అయి ఉండి అవమానకర వ్యాఖ్యలు చేసిందన్నారు.

‘‘ఒక లేడీ జర్నలిస్ట్ అయి ఉండి.. అవమానకరమైన వ్యాఖ్యలు చేసింది. ఇంగ్లండ్ రాణిగా ఉండటం కంటే మాతృత్వం పెద్ద ఆనందం. ప్రతి స్త్రీ ఒక రాణి.. ప్రతి సంతోషకరమైన ఇల్లు ఒక రాజ్యమే. ఒక సెలబ్రిటీ కావడానికి ముందు ఆమె కూడా ఒక సాధారణ మహిళే. గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె సంతోషంగా ఉండటానికి, బేబి బంప్‌ను చూపించుకునేందుకు పూర్తి హక్కు ఆమెకు ఉంది’’ అని ట్వీ్ట‌్‌లో పేర్కొన్నారు.

More News

మెగాఫోన్ ప‌ట్ట‌నున్న నిఖిల్‌..?

హీరో నిఖిల్ క‌థానాయ‌కుడిగా 18 పేజీస్‌, కార్తికేయ‌2 చిత్రాలు రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.

పిక్ చూసి హీరో ఎవరో కనుక్కోగలరా?

లాక్‌డౌన్ తరువాత మన హీరోల పిక్ పెట్టి.. ఎలాంటి హింట్ ఇవ్వకుండా ఎవరో కనుక్కోండి అంటే కొందరిని గుర్తించగలం కానీ..

హీరో సూర్య కోర్టు ధిక్కార‌ణ చేస్తున్నారంటూ లేఖ‌!!

హీరో సూర్య సినిమాలే కాదు.. అగ‌రం ఫౌండేష‌న్ ద్వారా పేద విద్యార్థుల‌కు స‌ర్వీస్ చేస్తుంటారు. అంతే కాదండోయ్‌..

ఐమాక్స్‌ థియేటర్‌ ఆపరేటర్ ఆత్మహత్య..

సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది కొద్ది మంది మాత్రమే.. నటీనటులతో పాటు డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇంతకు మించి ఒకరిద్దరు మినహా మనకు తెలియదు..

ప‌వ‌న్ 27 రేసులో మ‌రో టైటిల్‌..!

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో