మద్యం మత్తులో టవరెక్కి.. అర్ధరాత్రిపూట పోలీసులకు చెమటలు పట్టించిన మందుబాబు

  • IndiaGlitz, [Sunday,May 01 2022]

అమ్మానాన్న మందలించారనో , ప్రేమలో విఫలమయ్యారనో, భార్యాభర్తల మధ్య గొడవలనో.. ఇలా ఈ మధ్యకాలంలో చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి. అంతేకాదు.. బెదిరించి తమ పంతం నెగ్గించుకునేందుకు ఆత్మహత్యాయత్నాలు చేసేవారూ అంతే స్థాయిలో వున్నారు. ఈ కోవలోనే సెల్‌టవర్‌లు, విద్యుత్ స్తంభాలు ఎక్కి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇక అసలే కోతి ఆపై కల్లు తాగింది అన్న సామెత ప్రకారం.. కొందరు మందుబాబులు మద్యం మత్తులో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

తాజాగా హైదరాబాద్‌ నగరంలో మద్యం మత్తులో ఒక యువకుడు చేసిన హడావిడి పోలీసులకు, స్థానికులకు చెమటలు పట్టించింది. అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన నర్సింగ్ రావు అనే వ్యక్తి మద్యం మత్తులో ఫ్లెక్సీ కోసం ఏర్పాటు చేసిన టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. మద్యం మత్తులో దూకుతానంటూ బెదిరించాడు. దాదాపు అర్ధగంట పాటు ఆ ప్రాంతంలో హంగామా చేశాడు. సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అయితే అతను ఇలా టెన్షన్ పెట్టడం ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ నర్సింగ్ రావు గతంలో రెండు పర్యాయాలు టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం అర్థరాత్రి 11 గంటల ప్రాంతంలో టవర్ ఎక్కి మరోసారి పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. ఎట్టకేలకు అతనిని సురక్షితంగా కిందకు దించి పీఎస్‌కు తరలించారు పోలీసులు. గతంలో ఉద్యోగం కావాలని, భార్య తిట్టి పుట్టింటికి పోయిందంటూ టవర్ ఎక్కాడు నర్సింగ్ రావు.

More News

ఆటా మహాసభలకు ఎర్రబెల్లికి ఆహ్వానం.. తప్పక వస్తానన్న మంత్రి

అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ 17వ మహాసభలు జూలై 1 నుంచి జూలై 3 తేదీ వరకు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జరగనున్నాయి.

జగన్‌ను కలిసిన ఆటా ప్రతినిధులు.. తెలుగు మహాసభలకు రావాలంటూ ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆటా (అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌) ప్రతినిధులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో

నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా 'ముత్తయ్య' టీజర్ విడుదల

జీవితంలో ఒక్క సినిమాలోనైనా నటించాలని కోరుకునే వ్యక్తి ముత్తయ్య. అతని కోరిక నెరవేరిందా లేదా అనే ఆసక్తిని కలిగిస్తూ సాగింది "ముత్తయ్య" సినిమా టీజర్.

ఇప్పటికీ సమైక్యవాదినే.. టీఆర్ఎస్‌లో సమైక్యవాదులు లేరా, కేసీఆర్‌నే కొడతానన్నారు: జగ్గారెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్ధితులు, పరిపాలనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే.

ఏలూరు జిల్లాలో వైసీపీ నేత దారుణహత్య.. ఎమ్మెల్యేని చితకబాదిన స్థానికులు, ఉద్రిక్తత

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. జి.కొత్తపల్లికి చెందిన అధికార వైసీపీ నేత గంజి ప్రసాద్‌‌ను